Anil Kumar Yadav: చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్తే సింపతీ వచ్చిందని మీడియాలో చెప్పుకుంటున్నారు.. కానీ, సింపతీ లేదు తొక్క, తోటకూర ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయలసీమ అంటేనే పౌరుషాల గడ్డ, నాయకుడంటే పౌరుషం ఉన్నవాన్ని ఎన్నుకోవాలి.. అలాంటి నాయకుడే జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీరు మమ్మల్ని ఏమైనా అనొచ్చు, మేము గాని మిమ్మల్ని ఏదైనా అంటే బూతుల మంత్రులు అంటారు అని.. మీరు ఎట్లా తిట్టినా మాకు రోషం పౌరుషం ఉండకూడదు.. మేం గాని తిడితే మీకు రోషాలు పౌరుషాలు వస్తాయా..? అని దుయ్యబట్టారు.
Read Also: Dharmana Prasada Rao: 75 ఏళ్ల తర్వాత మార్పు వచ్చింది.. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడింది..
చంద్రబాబు తప్పు చేశాడని లోపల వేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయిన వ్యక్తి నారా లోకేష్ మీకు అవసరమా..? అని ప్రశ్నించారు అనిల్ కుమార్.. ప్రజల కోసం పాదయాత్రలు చేస్తున్నానంటూ నాటకాలు, భూటకపు మాటలు చెప్పిన ఆ పప్పు ఢిల్లీకి పారిపోయాడు… ఎక్కడ తనని కూడా లోపల వేస్తారేమోనని పాదయాత్ర మధ్యలోనే వదిలేసి వెళ్లిన పప్పు మీకు న్యాయం చేస్తాడా..? అని ప్రశ్న వేశారు.. ఈ రోజు జరుగుతున్న పోరాటం బలిసిన వాడికి, బక్కవాడికి.. బక్కవాడి పక్కన జగన్ మోహన్ రెడ్డి ఉంటే, బలిసిన వాడి పక్కన చంద్రబాబు, దత్తపుత్రుడు ఉన్నారన్నారు. ఎవరైనా పార్టీ పెట్టిది అధికారంలోకి రావాలని, కానీ, పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం పార్టీ పెట్టాడని ఆరోపించారు. చంద్రబాబు ని అరెస్ట్ చేస్తే కొడుకే పట్టించుకోలేదు.. కానీ, పవన్ మాత్రం రోడ్డు మీద పడుకున్నాడు.. అని ఎద్దేవా చేశారు.. పక్కవాడి పార్టీ కోసం పవన్ వచ్చి రోడ్డుమీద పడుకోవడం ఏంటి? అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లినందుకు సింపతీ వచ్చిందని మీడియాలో చెప్పుకుంటున్నారు.. కానీ, సింపతీ లేదు తొక్క తోటకూర ఏమీ లేదన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.