Liquor Sales: భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత తాగేశారంటే..?
- మద్యం అమ్మకాల్లో గణనీయ వృద్ధి.. బీర్ విక్రయాలు 70 శాతం పెరుగుదల..
- 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు జరిగిన విక్రయాలను పరిశీలిస్తే, ముఖ్యంగా బీర్ మరియు భారతీయ తయారీ మద్యం (ఐఎంఎల్) అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో మొత్తం సేల్స్ విలువలో స్పష్టమైన వృద్ధి నమోదైంది. గణాంకాల ప్రకారం, ఐఎంఎల్ విక్రయాలు 362 లక్షల కేసుల నుంచి 414 లక్షల కేసులకు పెరిగి 14.59 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మరోవైపు బీర్ విక్రయాలు మాత్రం 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగి 70.29 శాతం భారీ పెరుగుదల సాధించాయి. ఈ పెరుగుదలతో మొత్తం మద్యం అమ్మకాల విలువ రూ.29,440 కోట్ల నుంచి రూ.31,237 కోట్లకు చేరి 6.11 శాతం వృద్ధి నమోదు అయ్యింది.
అయితే, అమ్మకాలు పెరిగినప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం ఆశించినంతగా పెరగలేదు. మద్యం సేల్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.24,734 కోట్ల నుంచి రూ.25,727 కోట్లకు పెరిగి 4.01 శాతం వృద్ధి సాధించింది. కానీ, ఎల్ఎఫ్ మరియు ఇతర విభాగాల ఆదాయం రూ.4,112 కోట్ల నుంచి రూ.3,316 కోట్లకు పడిపోయి 19.37 శాతం తగ్గింది. ఈ ప్రభావంతో మొత్తం ఆదాయం రూ.28,846 కోట్ల నుంచి రూ.29,042 కోట్లకు మాత్రమే పెరిగి 0.68 శాతం స్వల్ప వృద్ధి నమోదైంది.
Also Read
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
తక్కువ ధరల మద్యం అమ్మకాలు పెరగడం కూడా ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా రూ.99 ధర ఉన్న 180 మిల్లీ లీటర్ బాటిళ్ల వినియోగం పెరగడంతో సుమారు రూ.442 కోట్ల మేర ఆదాయం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ప్రముఖ బ్రాండ్ల ధరలు తగ్గించడంతో మరో రూ.972 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. గత సంవత్సరంతో పోలిస్తే 180 మిల్లీ లీటర్ బాటిల్ సగటు ధర రూ.180 నుంచి రూ.160కి తగ్గడం కూడా ఆదాయంపై ప్రభావం చూపింది. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో లభించిన సుమారు రూ.1,900 కోట్ల నాన్-రీఫండబుల్ ఫీజులు ఈసారి లేకపోవడం వల్ల కూడా రెవెన్యూలో తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, మొత్తం గణాంకాలు రాష్ట్రంలో మద్యం వినియోగం గణనీయంగా పెరుగుతోందని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఇది ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి కొంత మేర ఉపయోగపడుతుండగా, మరోవైపు సామాజిక, ఆరోగ్యపరమైన అంశాలపై చర్చకు దారితీస్తోంది.
తాజావార్తలు
-
Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
-
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
-
Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
-
IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!
-
Albino Cobra: శ్వేతనాగు రహస్యాలు వింటే వణికిపోతారు.. ఈ తెల్ల పాముల వెనుక దైవ శక్తి ఉందా?
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!