NTV Telugu Site icon

Anasuya: నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ..

Anasua

Anasua

యాంకర్ అనసూయ ఏదైనా ముక్కు సూటిగా చెబుతుంది.. మనసులో ఏమనుకుందో దాన్ని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్తుంది..ఒక రకంగా చెప్పాలంటే ఆమె గట్స్ ను చూసే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.. తన గురించి ఎవరైనా చెత్తగా కామెంట్స్ చేస్తే మాత్రం గట్టిగా ఇస్తుంది.. గతంలో నెటిజెన్స్ మీద ఆమె మండిపడ్డారు. తనపై విమర్శలు చేసినందుకు కౌంటర్స్ ఇచ్చారు. తాజాగా అనసూయను సంబంధం లేని వివాదం లాగిన ఓ వ్యక్తిపై విరుచుకుపడింది. యాంకర్ రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. ఆమె సోషల్ మీడియాలో జీవ హింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.

బక్రీద్ పండగ సందర్బంగా జంతువుల బలికి వ్యతిరేకంగా రష్మీ ట్వీట్స్ చేశారు. దీంతో రష్మీ మీద ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయి. వ్యాపారం పేరుతో జీవహింస అనుక్షణం జరుగుతుంది. మీకు మా పండగ రోజు మాత్రమే జరిగే హింస మాత్రమే కనిపిస్తుందా అంటూ ఆమెను ప్రశ్నించారు. ఈ జీవ హింస వ్యవహారం కాస్త హిందూ-ముస్లిమ్స్ విబేధాలు, దాడుల వరకు చర్చ వెళ్ళింది.. ఇకపోతే రష్మీని పొగుడుతూ ఆమెకు గట్స్ ఉన్నాయి.. అందుకే ధైర్యంగా చెబుతుంది.. అదే అనసూయకు అంత ధైర్యం లేదు అంటూ రష్మీ పోస్ట్ కు కామెంట్ చేశాడు.. ఇలాంటి విషయాలు మీద మాట్లాడదు అంటూ కామెంట్ చేశాడు.

ఇక అంతే అది కాస్త అనసూయ కంట పడింది.. ఇక అంతే సంగతి..దానికి అను రియాక్ట్ అయ్యారు. ‘అవును ఇలాంటి విషయాల మీద మాట్లాడేందుకు నాకు బాల్స్ లేవు. కానీ తెలిసిన అంశాల మీద మాట్లాడేందుకు వజీనా ఉంది. అయినా ప్రతి ఒక్కరు ప్రతి అంశం మీద స్పందించాల్సిన అవసరం లేదు, అంటూ బోల్డ్ ట్వీట్ చేసింది.అనసూయ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న అనసూయను వివాదాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పెద్ద వార్ జరిగింది.. ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అనసూయ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం అను పుష్ప 2 సినిమాలో నటిస్తుంది..