Manipur Violence: మణిపూర్లో జరిగిన హింసపై అమిత్ షా సమీక్ష..
- ఏడాది కాలంగా జాతి హింసకు గురవుతున్న మణిపూర్
- శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష
- హాజరుకానున్న కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు.. సీనియర్ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాది కాలంగా జాతి హింసకు గురవుతున్న మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సమీక్షించనున్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భద్రతా బలగాలకు చెందిన సీనియర్ అధికారులు హాజరుకానున్నారు. అందుకోసమని.. ఆదివారం రోజున మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే సమీక్ష కోసం వచ్చారు. ఈ క్రమంలో.. ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు.
Read Also: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ పాటలు సందడి మొదలయేది అప్పుడే ..!
Also Read
మణిపూర్లో 2023 మే 3న షెడ్యూల్డ్ తెగ హోదా కోసం.. మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ డిమాండ్కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర తర్వాత హింస చెలరేగింది. అప్పటి నుండి హింస కొనసాగుతూనే ఉంది. ఈ హింసలో కుకీ, మెయిటీ వర్గాలకు చెందిన 220 మందితో పాటు కొందరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. వీరు ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తుంటారు. మరోవైపు.. నాగాలు, కుకీలను కలిగి ఉన్న గిరిజనులు 40 శాతం ఉన్నారు. వీరు కొండ జిల్లాలలో నివసిస్తుంటారు.
Read Also: NCERT Chief: ‘భారత్’, ‘ఇండియా’లను పాఠ్యపుస్తకాల్లో పరస్పరం మార్చుకోవాలి..
మరోవైపు.. మణిపూర్ లో ఏడాది తర్వాత కూడా శాంతి లేకుండా పోవడంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కలహాలతో దెబ్బతిన్న ఈశాన్య రాష్ట్రంలోని పరిస్థితిని ప్రాధాన్యతతో పరిగణించాలని అన్నారు. జూన్ 10న నాగ్పూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ ట్రైనీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా మణిపూర్ శాంతి కోసం ఎదురు చూస్తోందని.. పదేళ్ల క్రితం మణిపూర్లో శాంతి నెలకొందని.. అక్కడ తుపాకీ సంస్కృతి అంతమైపోయినట్లు అనిపించిందని.. కానీ రాష్ట్రంలో ఒక్కసారిగా హింస మొదలైందని తెలిపారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!