Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(మంగళవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొలిసారిగా అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు బీజేపీ అన్ని ఏర్పాట్లను చేపట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 24 గంటల్లోనే అమిత్ షా తెలంగాణలో పర్యటించడం తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. అమిత్ షా మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్కు వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Read Also:Vedanta : వేదాంత కంపెనీకి ట్యాక్స్ అథారిటీ భారీ జరిమానా.. ఎందుకంటే?
Also Read
అక్కడ సభ ముగిసిన అనంతరం 5.15 గంటలకు హెలికాప్టర్లో తిరిగి బేగంపేటకు చేరుకుంటారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్కు చేరుకుని.. సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ సిక్ విలేజ్లో మేధావులతో సమావేశం అవుతారు. అనంతరం కాకతీయ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చిస్తారు. రాత్రి 7.30 గంటలకు ఐటీసీ కాకతీయలో బీజేపీ క్యాడర్తో సమావేశం అవుతారు. తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా చేపట్టాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also:Indira Ekadashi Special: ఇందిరా ఏకాదశి శుభవేళ ఈ స్తోత్రాలు వింటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నోటిఫికేషన్ను ప్రకటించారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 3న వస్తుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, 2023. పరిశీలనకు చివరి తేదీ నవంబర్ 13. ఉపసంహరణకు చివరి తేదీ 15 నవంబర్. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!