Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు(మంగళవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొలిసారిగా అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు బీజేపీ అన్ని ఏర్పాట్లను చేపట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 24 గంటల్లోనే అమిత్ షా తెలంగాణలో పర్యటించడం తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది. అమిత్ షా మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్కు వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Read Also:Vedanta : వేదాంత కంపెనీకి ట్యాక్స్ అథారిటీ భారీ జరిమానా.. ఎందుకంటే?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
అక్కడ సభ ముగిసిన అనంతరం 5.15 గంటలకు హెలికాప్టర్లో తిరిగి బేగంపేటకు చేరుకుంటారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్కు చేరుకుని.. సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ సిక్ విలేజ్లో మేధావులతో సమావేశం అవుతారు. అనంతరం కాకతీయ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చిస్తారు. రాత్రి 7.30 గంటలకు ఐటీసీ కాకతీయలో బీజేపీ క్యాడర్తో సమావేశం అవుతారు. తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా చేపట్టాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also:Indira Ekadashi Special: ఇందిరా ఏకాదశి శుభవేళ ఈ స్తోత్రాలు వింటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నోటిఫికేషన్ను ప్రకటించారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 3న వస్తుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, 2023. పరిశీలనకు చివరి తేదీ నవంబర్ 13. ఉపసంహరణకు చివరి తేదీ 15 నవంబర్. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది.
తాజావార్తలు
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!