అమిత్ షా కాశ్మీర్ టూర్.. నేడు కీలక ప్రకటన !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీర్ టూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. విదేశీ శక్తులు కాశ్మీర్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయిన పోలీసు అధికారి పర్వేజ్ అహ్మద్ కుటుంబాన్ని పరామర్శించారు. కాశ్మీర్లో తీవ్రవాదుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు అమిత్షా. జమ్మూకాశ్మీర్ లో ఇవాళ రెండోరోజు తన పర్యటనను కొనసాగిస్తున్నారు కేంద్ర హోంమంత్రి.ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్షా.
కాశ్మీర్లో మైనార్టీలు, వలస కూలీల మీద దాడులు, తీవ్రవాదుల ఎన్కౌంటర్లు లాంటి ఘటనల మధ్య.. అమిత్షా మూడురోజుల పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల నౌగామ్లో తీవ్రవాదుల కాల్పుల్లో మరణించిన పోలీస్ అధికారి పర్వేజ్ అహ్మద్ కుటుంబాన్ని షా పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ అపాయింట్ మెంట్ లెటర్ను అహ్మద్ భార్యకు అందించారు. అమరవీరుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుందన్నారాయన.. జమ్మూ కాశ్మీర్లో చేపట్టిన అభివృద్ధి పనులపై రాజ్భవన్లో సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
రాష్ట్రంలో పెరుగుతున్న తీవ్రవాదం, రాడికలిజంతో పాటు సీమాంతర చొరబాట్లు, వలస కూలీలపై కాల్పుల విషయం గురించి షా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించేందుకే టెర్రరిస్ట్ మూకలు దాడులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.. జమ్మూ కాశ్మీర్కు ప్రభుత్వం ఇటీవలే 50 కంపెనీల అదనపు బలగాలను పంపించింది. శ్రీనగర్తో పాటు కశ్మీర్ లోయలోని పలుచోట్ల సీఆర్పీఎఫ్ దళాల బంకర్లు ఏర్పాటు చేశారు. కశ్మీర్ లోయలోని పలు రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేశారు. శ్రీనగర్లోని జవహర్ నగర్లో బీజేపీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఇక అమిత్షా కాశ్మీర్కు చేరుకున్న రోజునే శ్రీనగర్ నుంచి షార్జాకు తొలి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం అయ్యాయి. త్వరలోనే కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది.
తాజావార్తలు
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..