Joe Biden: వయనాడ్ ఘటనపై అమెరికా ప్రథమ మహిళ జిల్, అధ్యక్షుడు బైడెన్ సంతాపం..
- కేరళలోని వయనాడ్లో తీవ్ర విషాధం
- ఇప్పటికే 300పైగా మృతి
- ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన జిల్.. బైడెన్
- మీకు మేమున్నామని ధైర్యం చెప్పిన బైడెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ రెస్క్యూ ఆపరేషన్లో మొదటిగా నిలిచిన సేవా సభ్యులు, సిబ్బంది ధైర్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో అయిదు రోజుల కిందట కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. శిథిలాల తొలగింపు తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై తాజాగా జిల్ (అమెరికా ప్రథమ మహిళ), అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
READ MORE: Moon Drifting Away: భూమికి దూరంగా వెళ్తున్న చంద్రుడు.. రోజుకు 25 గంటలే..!
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
“ఈ విషాద సంఘటనలో బాధితుల కోసం ప్రార్థనలు చేస్తున్నాం. కుటుంబీకులను కోల్పోయిన వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. సంక్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్లో సహకరించిన భారతీయ సేవా సభ్యుల ధైర్యాన్ని, ప్రథమ స్పందనదారులను మేము అభినందిస్తున్నాం. మీ కృషి ఎనలేనిది.. ఈ క్లిష్ట సమయంలో అమెరికా భారతదేశ ప్రజలతో ఉంది.” అని జో బైడెన్ పేర్కొన్నారు.
READ MORE: AP Capital: రాజధాని ప్రాంతంలో నిపుణుల బృందం పర్యటన..
కాగా.. ప్రకృతి అందాలకు నెలవైన కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ప్రస్తుతం ఎటు చూసినా కూడా విషాద వాతావరణం నెలకొని ఉంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం మరణించిన వారి సంఖ్య 344కి చేరింది. ఇంకా 200 మందికి పైగా తప్పిపోయినట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాలంలో పోటీ పడుతున్నారు. బురదలో కూరుకుపోయిన ఇళ్లలో ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా..? అని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డీప్ సెర్చ్ రాడార్ ఉపయోగించి చిక్కుకుపోయిన వారిని కనుగొనే ప్రయత్నం జరుగుతోంది.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!