Ambulance Incident : డబ్బులు డిమాండ్ చేసిన డ్రైవర్ పై యాక్షన్ కు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambulance Incident : పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురిలో గురువారం ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంతో విస్తుపోయిన కొడుకు తన తల్లి మృతదేహాన్ని తన భుజంపై మోసుకెళ్లిన సంఘటన జరిగింది. ఈ కేసు వెలుగులోకి రావడంతో మూడు వేల రూపాయలు అదనంగా డబ్బులు డిమాండ్ చేసిన డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశ్వజిత్ మహతో ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు కూడా ఆదేశించారు. లక్ష్మీరాణి దేవాన్ అనే మహిళ అస్వస్థతకు గురై జల్పాయ్గురి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. ఆమె గురువారం చనిపోయింది. మృతదేహాన్ని తరలించేందుకు స్థానిక అంబులెన్స్ డ్రైవర్ ఆమె కొడుకును రూ.3000 డిమాండ్ చేశాడు.
Read Also: Delhi Mayor Polls: మేయర్ పీఠం కోసం కొట్లాట.. తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
రోజు వారీ కూలీ చేసుకునే అతడు ఇవ్వలేకపోవడంతో.. తన తల్లి మృతదేహాన్ని తరలించేందుకు డ్రైవర్ నిరాకరించాడు. దీంతో చేసేదేంలేక తండ్రి సాయంతో తల్లి మృతదేహాన్ని భుజాన వేసుకుని ఉన్నాడు. జల్పాయ్గురి నుండి వారి సొంత ఊరు క్రాంతికి దాదాపు యాభై కిలోమీటర్లు నడక ప్రారంభించారు. ఉదయం ఏడు గంటలకు మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన పలువురు కంటతడిపెట్టుకున్నారు. కొన్ని ప్రభుత్వేతర సంస్థల సహకారంతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి దహన సంస్కారాలు చేసినప్పటికీ ఘటన వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు, జల్పాయ్గురి జిల్లా పోలీసులు స్థానిక సదర్ ట్రాఫిక్ కార్యాలయంలో ప్రైవేట్ వాహన డ్రైవర్లకు అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. అవగాహన శిబిరంలో డ్రైవర్లు మరింత మానవత్వంతో ప్రవర్తించాలని జల్పాయిగురి అదనపు పోలీసు సూపరింటెండెంట్ సందీప్ సేన్ కోరారు.
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!