తనపై జరిగిన దాడిని చిన్నదిగా చూడొద్దని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. నాపై దాడి వెనుక భారీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నాపై దాడి చేసిన వారిలో 9 మందిని గుర్తించి ఆరుగురిని అరెస్టు చేశారని తెలిపారు. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో నేను భువనేశ్వరిని తప్పుగా మాట్లాడలేదని మంత్రి వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పీకే కాదు..కిరాయి కోటిగాడు అని అభివర్ణించారు. చంద్రబాబును ఏదైనా అంటే పవన్ మాత్రం రోడ్డు మీద పడుకుంటాడు.
Also Read : Rohit Sharma: మేం 30 పరుగులు తక్కువ చేశాం.. మా బౌలర్లు సూపర్!
ముద్రగడపై దాడి చేసినప్పుడు పవన్ ఖండించాడా అని ప్రశ్నించారు. కమ్మ వర్గంలో ఉగ్రవాదులు తయారయ్యారు. వారు టీడీపీని నాశనం చేస్తున్నారు. టీడీపీ అంత బలంగా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా?. భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీకానీ, వ్యక్తిగానీ బ్రతికి బట్ట కట్టలేదు. ముద్రగడ మీద దాడి జరిగినప్పుడు కూడా నేను ఖండించాను. పవన్ కల్యాణ్ అంటే పీకే కాదు.. కిరాయి కోటిగాడు. ఆయన కిరాయి తీసుకుంటాడు కాబట్టి ఖండించడు. ప్రగల్భాలు పలికే పవన్.. చంద్రబాబును ఏదైనా అంటే మాత్రం రోడ్డు మీదకు వచ్చి పడుకుంటాడు’ అని ఎద్దేవా చేశారు.
Also Read : Balakrishna : బాలయ్యతో సుకుమార్ సినిమా..? పుష్పను మించిన స్టోరీనా..
