Minister Narayana: మూడు ముక్కలాట ముగిసింది.. 2028 ఆగస్టుకి అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం!
- ధర్మం గెలిచింది, మూడుముక్కలాట ముగిసింది
- అమరావతి రాజధాని అని చట్టసభలో ఆమోదం పొందింది
- చట్టసభల్లో ఏం మాట్లాడాలో అర్ధం కాక వైసీపీ నేతలు ప్లాట్లు, ఖర్చు అంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధర్మం గెలిచింది, మూడుముక్కలాట ముగిసిందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి రాజధాని అని చట్టసభలో ఆమోదం పొందిందన్నారు. చట్టసభల్లో ఏం మాట్లాడాలో అర్ధం కాక వైసీపీ నేతలు ప్లాట్లు, ఖర్చు అంటున్నారని.. ప్లాట్లు ఇక అలాట్ చేయాల్సింది 650 మందికి మాత్రమే అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలీదని.. అవినీతి అంటాడు, జీఎస్టీ అంటాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2028 ఆగస్టుకి రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో అమరావతి చట్టభద్రతపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.
‘ధర్మం గెలిచింది, మూడుముక్కలాట ముగిసింది. అమరావతి రాజధాని అని చట్టసభలో ఆమోదం పొందింది. చట్టసభల్లో వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాక ప్లాట్లు, ఖర్చు అంటున్నారు. ప్లాట్లు ఇక అలాట్ చేయాల్సింది 650 మందికి మాత్రమే. డేటా తీసుకొని మాట్లాడితే బావుంటుంది, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దాదాపు అందరికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. 70,790 ప్లాట్లు అలాట్ చేసాం, కొందరికే ఆగాయి. వైఎస్ జగన్ ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలీదు. అవినీతి అంటాడు, జిఎస్టీ అంటాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అబద్దాలు మాట్లాడుతున్నారు. నేను ఢిల్లీకి వెళ్లి జీఎస్టీ గురించి మాట్లాడి వచ్చాను. నోటికొచ్చిన రేట్లు చెప్పడం సరికాదు’ అని మంత్రి నారాయణ అన్నారు.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
Also Read: Tiger Scare: పోలవరం ప్రాంతంలో పులి సంచారం కలకలం.. రామదుర్గం కొండపై సందర్శకులు ఆందోళన!
‘అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మిస్తున్నాం. ప్రజా పన్ను అమరావతిలో ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టం. హైదరాబాద్ కంటే అమరావతిని అభివృద్ధి చేయాలని సీఎం చూస్తున్నారు. అంతర్జాతీయ క్రీడా స్టేడియంలు కడుతున్నాం. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కట్టాలి, అందుకు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం. 2028 ఆగస్టుకి అమరావతి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. సర్వే రాళ్లపై వైఎస్ జగన్ బొమ్మ వేసుకోవడాని 750 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాడు. రాజధానులు నుంచి వచ్చే ఆదాయంతో అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతుంది. ప్రజలను తప్పుదోవ పాటించాలనే త్రోవలోనే జగన్ నడుచుకుంటున్నాడు. జగన్ ఏం మాట్లాడారో నాకు అర్ధం కాలేదు. జగన్ మూడు రాజధానుల, మూడు ముక్కలాట ముగిసింది. మళ్లీ రాజదాని అంశంపై మరో మూడు ముక్కలాట మొదలు పెట్టారు’ అని మంత్రి నారాయణ విమర్శించారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!