Minister Narayana: మూడు ముక్కలాట ముగిసింది.. 2028 ఆగస్టుకి అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం!
- ధర్మం గెలిచింది, మూడుముక్కలాట ముగిసింది
- అమరావతి రాజధాని అని చట్టసభలో ఆమోదం పొందింది
- చట్టసభల్లో ఏం మాట్లాడాలో అర్ధం కాక వైసీపీ నేతలు ప్లాట్లు, ఖర్చు అంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధర్మం గెలిచింది, మూడుముక్కలాట ముగిసిందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి రాజధాని అని చట్టసభలో ఆమోదం పొందిందన్నారు. చట్టసభల్లో ఏం మాట్లాడాలో అర్ధం కాక వైసీపీ నేతలు ప్లాట్లు, ఖర్చు అంటున్నారని.. ప్లాట్లు ఇక అలాట్ చేయాల్సింది 650 మందికి మాత్రమే అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలీదని.. అవినీతి అంటాడు, జీఎస్టీ అంటాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2028 ఆగస్టుకి రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో అమరావతి చట్టభద్రతపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.
‘ధర్మం గెలిచింది, మూడుముక్కలాట ముగిసింది. అమరావతి రాజధాని అని చట్టసభలో ఆమోదం పొందింది. చట్టసభల్లో వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాక ప్లాట్లు, ఖర్చు అంటున్నారు. ప్లాట్లు ఇక అలాట్ చేయాల్సింది 650 మందికి మాత్రమే. డేటా తీసుకొని మాట్లాడితే బావుంటుంది, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దాదాపు అందరికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. 70,790 ప్లాట్లు అలాట్ చేసాం, కొందరికే ఆగాయి. వైఎస్ జగన్ ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలీదు. అవినీతి అంటాడు, జిఎస్టీ అంటాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అబద్దాలు మాట్లాడుతున్నారు. నేను ఢిల్లీకి వెళ్లి జీఎస్టీ గురించి మాట్లాడి వచ్చాను. నోటికొచ్చిన రేట్లు చెప్పడం సరికాదు’ అని మంత్రి నారాయణ అన్నారు.
Also Read
Also Read: Tiger Scare: పోలవరం ప్రాంతంలో పులి సంచారం కలకలం.. రామదుర్గం కొండపై సందర్శకులు ఆందోళన!
‘అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మిస్తున్నాం. ప్రజా పన్ను అమరావతిలో ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టం. హైదరాబాద్ కంటే అమరావతిని అభివృద్ధి చేయాలని సీఎం చూస్తున్నారు. అంతర్జాతీయ క్రీడా స్టేడియంలు కడుతున్నాం. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కట్టాలి, అందుకు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం. 2028 ఆగస్టుకి అమరావతి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. సర్వే రాళ్లపై వైఎస్ జగన్ బొమ్మ వేసుకోవడాని 750 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాడు. రాజధానులు నుంచి వచ్చే ఆదాయంతో అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతుంది. ప్రజలను తప్పుదోవ పాటించాలనే త్రోవలోనే జగన్ నడుచుకుంటున్నాడు. జగన్ ఏం మాట్లాడారో నాకు అర్ధం కాలేదు. జగన్ మూడు రాజధానుల, మూడు ముక్కలాట ముగిసింది. మళ్లీ రాజదాని అంశంపై మరో మూడు ముక్కలాట మొదలు పెట్టారు’ అని మంత్రి నారాయణ విమర్శించారు.
తాజావార్తలు
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?