South Central Railway: ఆసిఫాబాద్-రేచిని రోడ్డు మధ్య విద్యుద్దీకరణతో పాటు మూడో లైన్ పనులు పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే కాజీపేట-బళ్లార్ష విద్యుద్దీరణ ప్రాజెక్టులో భాగంగా.. ఆసిఫాబాద్- రేచిని రోడ్డు మధ్య 19 కిలోమీటర్ల దూరం వరకు విద్యుద్దీకరణతో పాటు మూడవ రైల్వే లైన్ పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకొనివచ్చింది. గ్రాండ్ ట్రంక్ మార్గంలోని కాజీపేట-బళ్లార్ష మధ్య ఉన్న ఈ సెక్షన్.. దేశంలోని ఉత్తర ప్రాంతాన్ని దక్షిణ ప్రాంతంతో అనుసంధానించే కీలకమైన రైలు మార్గం. ఈ కీలకమైన ప్రాజెక్టులో ఇప్పటివరకు మొత్తం 151 కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేశారు. గతంలో పూర్తిచేయబడిన రాఘవాపురం-మందమర్రి సెక్షన్ ను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం కాజీపేట-బళ్లార్ష సెక్షన్ లో మొత్తం 184 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణతో పాటు మూడో లైన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
Tamilisai: తెలంగాణ ప్రజలను వదిలి వెళ్తునందుకు బాధగా ఉంది.. ఎప్పటికీ మరువను
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
కాజీపేట- బళ్లార్ష మధ్యగల ఈ సెక్షన్.. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. ఈ కీలక విభాగంలో మెయిన్ లైన్ ప్యాసింజర్ మరియు సరకు రవాణా విభాగాల తరలింపును పెంపొందించుటలో తోడ్పడుతూ.. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లపై అధిక వత్తిడిని తగ్గిస్తుంది. మొదట్లో ఈ కీలక విభాగంలో రద్దీని తగ్గించడానికి 2016 సంవత్సరంలో రాఘవాపురం-మందమర్రి మధ్య 33 కిలోమీటర్ల మేర మూడవ లైన్ పనులు పూర్తిచేశారు. కాజీపేట- బళ్లార్ష సెక్షన్ లోని మిగిలిన 202 కి.మీమేర (ఇందులో తెలంగాణ పరిధిలోని 159 కి.మీ. & మహారాష్ట్ర సరిధిలోని 43కి మీ) భాగంలో ట్రాఫిక్ ను మరింత సులభతరం చేసేందుకు ట్రిప్లింగ్ 5 విద్యుద్దీకరణ పనుల కోసం 2015-16 సంవత్సరంలో రూ.2,063 కోట్ల కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేశారు. అందులో భాగంగా హసన్ పర్తి రోడ్డు-రాఘవాపురం మధ్య 72 కిలోమీటర్లు.. సిర్పూర్ కాగజ్ నగర్-మాణిక్ ఘర్ మధ్య 60 కిలోమీటర్ల మేర పనులు ఇప్పటికే పూర్తి చేశారు.
CM Revanth: ముంబై నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 159 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోకి వచ్చే 19 కిలోమీటర్ల మేర ఆసిఫాబాద్- శనిని రోడ్డు మధ్య మూడో లైన్ పనులు పూర్తి అవ్వడంతో ఈ ప్రాంతంలో సామాజిక ఆర్ధిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ విభాగంలో మూడవ లైన్ ను ప్రారంభించడం వల్ల.. ఈ గ్రాండ్ ట్రంక్ రూట్ సరుకు రవాణా మరియు ప్యాసింజర్ రైళ్లను సజావుగా నడిచేందుకు వీలుకలుగుతుంది. ఈ ప్రాజెక్టు మిగిలిన భాగాలలో పనులు వేగంగా జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ నిర్ణీత సమయంలో మూడవ లైన్ పనులను పూర్తి చేసినందుకుగాను సికింద్రాబాద్ డివిజన్ మరియు నిర్మాణ సంస్థ బృందాన్ని అభినందించారు.
తాజావార్తలు
-
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!