Air India Freedom Sale: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఫ్రీడమ్ సేల్ను ప్రారంభించింది. ఇందులో ప్రయాణీకులు రూ. 1947కే ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీని కోసం ఆగస్ట్ 5 వరకు ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తన 15 అంతర్జాతీయ, 32 దేశీయ మార్గాల్లోని ప్రయాణీకులకు ఈ ఆఫర్ ను అందిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇందులో ఢిల్లీ – జైపూర్, బెంగళూరు – గోవా, ఢిల్లీ – గ్వాలియర్ వంటి మార్గాలు కూడా ఉన్నాయి.
Delhi : తీహార్ జైల్లో ఇన్ స్టా ఉపయోగిస్తూ ఫోటోలను షేర్ చేస్తున్న గ్యాంగ్ స్టర్
కస్టమర్లకు ఈ ఫ్రీడమ్ సేల్ ఆగస్ట్ 5, 2024 వరకు వర్తిస్తుందని ఎయిర్ లైన్ తెలిపింది. ఇంతకు ముందు బుక్ చేసుకుంటే వారు ఈ ఆఫర్ను పొందవచ్చు. దీని కోసం ప్రయాణీకులు 20 ఆగస్టు నుండి 30 సెప్టెంబర్ 2024 వరకు బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటుగా., Airindiaexpress.com లో బుక్ చేసుకునే కస్టమర్లు ప్రత్యేకమైన జీరో – చెక్ – ఇన్ బ్యాగేజ్ ఎక్స్ ప్రెస్ లైట్ ఫేర్ ను కూడా పొందవచ్చు. ఎక్స్ ప్రెస్ లైట్ ఛార్జీలో ఎటువంటి ఛార్జీ లేకుండా అదనపు 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకునే ఎంపిక, దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ. 1000, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు ₹1300 తగ్గింపు చెక్ ఇన్ బ్యాగేజీని పొందే ఎంపిక కూడా చేర్చబడింది.
Join us as we kick off our celebration of 77 years of Independence with our #FreedomSale. #FlyAsYouAre with Xpress Lite fares starting from ₹1947. Or spread your wings with special Value, Flex or Biz fares across our network. Personalise your travel experience with up to 47% off… pic.twitter.com/i8sCjUa2iP
— Air India Express (@AirIndiaX) July 31, 2024