AIIMS Delhi Servers: ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై సైబర్ దాడి.. చైనా హ్యాకర్ల పనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIIMS Delhi Servers: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్లపై సైబర్ దాడికి పాల్పడింది చైనా హ్యాకర్లేనని ప్రభుత్వ వర్గాలు ఈ రోజు తెలిపాయి. ప్రస్తుతం అందులోని డేటాను రిట్రీవ్ చేసినట్లు తెలిపాయి. ఈ సైబర్ దాడి చైనా హ్యాకర్ల పనే అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. హ్యాక్ చేసిన డేటాను ఆసుపత్రి వర్గాలు తిరిగి పొందినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్లోని 100 సర్వర్లలో.. 40 భౌతికంగా,60 వర్చువల్గా పనిచేస్తున్నాయి. ఇందులో 5 భౌతిక సర్వర్లలో హ్యకర్లు చొరబడినట్లు వెల్లడించారు. నష్టం జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు అది అదుపులో ఉందన్నారు. ఐదు సర్వర్లలోని డేటా విజయవంతంగా తిరిగి పొందబడిందన్నారు.
India-China Clash: పార్లమెంట్ను కుదిపేస్తున్న సరిహద్దు ఘర్షణలు.. విపక్షాలు వాకౌట్
Also Read
- Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
- IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
- IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
నవంబరు 23న మొదటిసారిగా సర్వర్లపై సైబర్ దాడి జరిగింది. రెండు రోజుల తర్వాత ఢిల్లీ పోలీస్లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) సైబర్ టెర్రరిజం కింద కేసును నమోదు చేసింది. అయితే సర్వర్లను పునరుద్ధరించడానికి హ్యాకర్లు రూ. 200 కోట్ల క్రిప్టోకరెన్సీని అడిగారన్న నివేదికలను పోలీసులు ఖండించారు. హ్యాక్ చేసిన సర్వర్లలో కోట్లాది మంది రోగుల సమాచారం నిక్షిప్తమై ఉంది. ఇందులో వీవీఐపీలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల సమాచారం కూడా ఉంది. హ్యాకింగ్ గురించి తెలియగానే.. ఎయిమ్స్లో అన్ని సర్వర్లు, కంప్యూటర్లకు యాంటీ వైరస్ సొల్యూషన్ ప్రక్రియ చేపట్టారు. దీనిపై ఎయిమ్స్ కూడా ఓ ప్రకటనను విడుదల చేసింది. సర్వర్లలో ఈ హాస్పిటల్ డేటాను పునరుద్ధరిస్తున్నామని తెలిపింది. డేటా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మరికొంత సమయం పడుతుందని.. అందువల్ల అప్పటివరకు ఆసుపత్రిలో అన్ని సేవలు మ్యానువల్గా జరుగుతాయని ఎయిమ్స్ వెల్లడించింగి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సమగ్ర విచారణ జరిపి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు ఈ అంశం పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది. “దాడి మూలం, ఉద్దేశం, పరిధి అస్పష్టంగానే ఉంది” అని తిరువనంతపురం ఎంపీ లోక్సభలో అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
-
IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
-
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
-
IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
-
Peddi : 400 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!