PM Kisan Payment Date 2026: రైతన్నలకు శుభవార్త.. PM కిసాన్ డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడుతాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan Payment Date 2026: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరిన లక్షలాది మంది రైతులు ఇప్పుడు 22వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర విడుదల చేసే డబ్బులు ఎప్పుడు తమ ఖాతాలో పడుతాయని రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం హోలీకి ముందు రైతుల ఖాతాలకు రూ.2 వేలు బదిలీ చేయవచ్చని అంటున్నారు. ఈ విడత ఫిబ్రవరి 2026 మొదటి లేదా రెండవ వారంలో విడుదల కావచ్చని చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 11, 2026న రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని సమాచారం. అయితే కేంద్రం ఇప్పటి వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే అధికారిక తేదీని విడుదల చేయలేదు.
READ ALSO: T20 World Cup: యూ-టర్న్ డ్రామా.. పాకిస్తాన్ను ఐసీసీ ఎలా దారికి తెచ్చింది..?
Also Read
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏటా రూ.6,000 ఇస్తుంది. ఈ మొత్తాన్ని కేంద్రం ఒకేసారి చెల్లించదు. కానీ ఒక్కో దఫాలో రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా చెల్లిస్తుంది. ఈ డబ్బును DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు. ఈ పథకం రైతులు తమ వ్యవసాయ ఖర్చులు, గృహ అవసరాలను సులభంగా తీర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి రైతు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందరు.
ప్రభుత్వం కొంతమంది రైతులను ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఒక రైతు ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేస్తే, వారికి పీఎం కిసాన్ డబ్బులు చెల్లించక పోవచ్చు. అలాగే భార్యాభర్తలిద్దరూ లేదా ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సభ్యులకు PM కిసాన్ ప్రయోజనాలను పొందుతుంటే వారికి చెల్లింపులు ఆలస్యం కావచ్చు. అటువంటి సందర్భాలలో ప్రభుత్వం భౌతిక ధృవీకరణను నిర్వహిస్తుంది. ఈ ధృవీకరణ పూర్తయ్యే వరకు, పీఎం కిసాన్ ప్రయోజనాలు తాత్కాలికంగా నిలిపి వేస్తారు. కొన్నిసార్లు, ఆధార్, బ్యాంక్ ఖాతా లేదా భూమికి సంబంధించిన సమాచారంలో వ్యత్యాసాల కారణంగా చెల్లింపులు ఆగిపోతాయి.
రైతులు కేంద్రం మంజూరు చేస్తున్న PM కిసాన్ ప్రయోజనాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అధికారిక PM కిసాన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. అందులో చెక్ చేసుకోవచ్చు. లేదంటే రైతులు తమ వాయిదా ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకోడానికి, అది ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి eMitra చాట్బాట్ను కూడా ఉపయోగించవచ్చు. PM-KISAN పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు. దీని ప్రాథమిక లక్ష్యం చిన్న, సన్నకారు రైతులకు అప్పులు చేయకుండా వారి వ్యవసాయ ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, గృహ అవసరాలను తీర్చగలిగేలా ఆర్థిక సహాయం అందించడం.
తాజావార్తలు
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!
-
108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
-
ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!