Food Inflation: కూరగాయల తర్వాత హడలెత్తిస్తున్న పండ్ల ధరలు.. ఆపిల్ ఉత్పత్తిలో 40శాతం తగ్గుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Inflation: సాధారణ ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి ఎలాంటి ఉపశమనం లభించడం లేదు. పచ్చి కూరగాయల తర్వాత యాపిల్స్ కూడా కన్నీళ్లు తెప్పిస్తాయి. ఎందుకంటే ఈ సీజన్లో భారీ వర్షాల కారణంగా యాపిల్ పంటకు భారీ నష్టం వాటిల్లింది. దీని వల్ల యాపిల్ ఉత్పత్తిలో భారీ తగ్గుదల ఏర్పడుతుందని అంచనా వేశారు. ఈ సీజన్లో అధిక వర్షాల కారణంగా యాపిల్ విస్తీర్ణం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాశ్మీర్ , హిమాచల్ ప్రదేశ్ లలో వాతావరణం కారణంగా సుమారు రూ.1000 కోట్ల విలువైన యాపిల్ పంట నాశనమైంది. ఉత్పత్తి తగ్గిన తరువాత, మార్కెట్కు ఆపిల్ సరఫరా తగ్గుతుంది. దీని కారణంగా ధరలు ఆకాశాన్నంటనున్నాయి.
కాశ్మీర్, హిమాచల్ప్రదేశ్లలో మాత్రమే యాపిల్స్ అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. దేశీయ వినియోగానికి ఈ రెండు రాష్ట్రాల నుంచి సరఫరా అవుతుంది. ఇదే కాకుండా ఈ రెండు రాష్ట్రాలు తమ పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లకు కూడా ఆపిల్లను సరఫరా చేస్తున్నాయి. అయితే వాటి పరిమాణం రెండు శాతం కంటే తక్కువ. మరోవైపు వర్షంతో పాటు సీజనల్ వ్యాధులు కూడా యాపిల్ పంటకు చాలా నష్టం కలిగించాయని రైతు సంఘం అంటోంది. ఫంగస్ కారణంగా ఈసారి ఆపిల్ పంటకు వ్యాధి సోకింది. దీని కారణంగా పండ్లు కుళ్ళిపోవడం ప్రారంభించాయి.
Also Read
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
Read Also:Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి
భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్లో దాదాపు 10 శాతం యాపిల్ తోటలు కొట్టుకుపోయాయని యునైటెడ్ కిసాన్ మంచ్ రాష్ట్ర కన్వీనర్ హరీష్ చౌహాన్ పేర్కొన్నారు. దీంతో యాపిల్ పంట కూడా దెబ్బతిందని, యాపిల్ తోట పూర్తిగా సిద్ధమయ్యేందుకు దాదాపు 15 ఏళ్లు పడుతుందని అంటున్నారు. ఈసారి యాపిల్ ఉత్పత్తి భారీగా తగ్గుతుందని యాపిల్ గ్రోవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కశ్మీర్ వ్యాలీ ఫ్రూట్ గ్రోవర్స్ చెబుతున్నారు. గతేడాది 1.87 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో పోలిస్తే 50 శాతం తగ్గుతుందని ఆయన అంచనా వేశారు. చలికాలంలో మంచు ఎక్కువగా కురుస్తుందని యాపిల్ గ్రోవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ చౌహాన్ తెలిపారు. ఆ తర్వాత మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా ఇప్పటికే పంటలు దెబ్బతిన్నాయి.
కాశ్మీర్లో ఈసారి సగటు కంటే 50 శాతం ఎక్కువ వర్షం కురిసింది. జూన్ 1 న రుతుపవనాలు మొదలైన దగ్గరనుంచి ఆపిల్ రెండవ అతిపెద్ద ఉత్పత్తి రాష్ట్రమైన హిమాచల్లో సాధారణం కంటే 79 శాతం ఎక్కువ వర్షం కురిసింది. కశ్మీర్లోని ఉద్యానవన శాఖ హార్టికల్చర్లో మొత్తం 109.78 మిలియన్ అమెరికన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్లో గతేడాది ఉత్పత్తి అయిన 6,40,000 మెట్రిక్ టన్నుల కంటే ఈసారి యాపిల్ ఉత్పత్తి 40 శాతం తక్కువగా ఉంటుందని హిమాచల్ ప్రదేశ్ అధికారి ఒకరు తెలిపారు.
Read Also:Manipur Violence: హింసాకాండ నేపథ్యంలో నేడు మణిపూర్లో పర్యటించనున్న ప్రతిపక్ష కూటమి
తాజావార్తలు
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!