Karnataka High Court: విడాకులు తీసుకున్నతర్వాత భార్య కట్నం, నగలు వెనక్కి ఇవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ విడాకుల కేేసులో కర్ణాటక హైకోర్ట్ సంచనల తీర్పు వెల్లడించింది. వివాహాన్ని రద్దు చేసుకున్నతర్వాత మహిళకు సంబంధించి వస్తువులను ఆమె భర్త తన వద్ద ఉంచుకోలేదరని తీర్పు వెల్లడించింది. ముంబైకి చెందిన వ్యక్తి తనపై మాజీ భార్య చేసిన ఫిర్యాదును బెంగళూర్ కోర్ట్ లో సవాల్ చేశాడు. ఈ కేసు విచారణ సందర్భంలో హైకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తికి మహిళకు 1998లో డిసెంబర్ లో వివాహం జరిగింది. వివాహ సమయంలో ‘ స్త్రీ ధాన్ ’ కింద రూ. 9 లక్షలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం వివాహం రద్దు చేసుకున్న తరువాత తన డబ్బును రూ. 9 శాతం వడ్డికీ ఇవ్వాలని మహిళ కోరింది. ఈ విషయమై 2009లో భర్త, అత్తా మామలపై సదరు మహిళ ఫిర్యాదు చేసింది.
2018లో ఈ కేసులో ట్రయల్ కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సదరు వ్యక్తి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తమ వివాహాన్ని బాంబే హైకోర్ట్ రద్దు చేసిందని.. తన మాజీ భార్యకు శాశ్వత భరణం కింద రూ. 4 లక్షలు చెల్లించాని కోర్టుకు చెప్పాడు. ఇదిలా ఉంటే విడాకులు తీసుకున్న తరువాత భర్త చెల్లించే భరణంలో తను ఇచ్చిన కట్నం రూ. 9 లక్షలు లేదని సదరు మహిళ కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో భర్త చెల్లించే భరణం నుంచి రూ. 9 లక్షలు వేరుగా ఉన్నాయని.. విడాకుల తర్వాత భార్య తెచ్చిన వస్తువులన్నింటినీ కుటుంబ సభ్యులు తమ వద్ద ఉంచుకోలేరని న్యాయమూర్తి నాగప్రసన్న వ్యాఖ్యానించారు.
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం