Delhi : అప్పుడు మార్షల్స్ ను పెట్టించి అసెంబ్లీ నుంచి వెళ్లగొట్టారు.. కట్ చేస్తే ప్రస్తుతం కాబోయే స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించగా, అసెంబ్లీ స్పీకర్ పదవికి విజేంద్ర గుప్తా పేరును ఖరారు చేశారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందుకు విజేంద్ర గుప్తాను సభ నుండి బహిష్కరించారు. ఆ సందర్భానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మార్షల్స్ అతడిని భుజాలపై మోసుకుని సభ నుండి బయటకు తీసుకెళ్లారు.
Read Also:KIA: అకస్మాత్తుగా 1,380 కార్లను రీకాల్ చేసిన కియా.. ఏమైందో తెలుసా?
Also Read
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
విజేంద్ర గుప్తాను ఇలా ఒకసారి కాదు.. చాలాసార్లు సభ నుండి బయటకు పంపించారు. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ వేవ్ లో ఢిల్లీలో బిజెపికి కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత కూడా బిజెపి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఏ ప్రయత్నం కూడా చేయలేదు. విజేంద్ర గుప్తా అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు.. ఆయన సమస్యలను లేవనెత్తేవారు. 2017లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయేందర్ గుప్తా భూ కుంభకోణానికి సంబంధించిన పత్రాలతో వచ్చి సభలో దానిపై చర్చకు డిమాండ్ చేశారు. కానీ అసెంబ్లీ స్పీకర్ దానికి అనుమతించలేదు. బిజెపి వాయిదా తీర్మానం కూడా తిరస్కరించబడింది. దీని తరువాత కూడా బిజెపి గందరగోళం కొనసాగినప్పుడు, స్పీకర్ మొదట విజేంద్ర గుప్తా మైక్ను స్విచ్ ఆఫ్ చేసి, మౌనంగా ఉండమని హెచ్చరించారు. అతను అంగీకరించకపోవడంతో మార్షల్ బయటకు తోసేశారు.
ఢిల్లీలో బిజెపికి కేవలం 3 సీట్లు మాత్రమే ఉన్న సమయంలో కూడా విజయేందర్ గుప్తా తన స్థానాన్ని కాపాడుకోవడంలో విజయం సాధించాడు. విజయేంద్ర గుప్తా సీటు వాటిలో ఒకటి. ఆయన 2015, 2020, 2025 సంవత్సరాల్లో రోహిణి నుండి కంటిన్యూగా ఎన్నికయ్యారు. 2020లో కూడా విజేంద్ర గుప్తా రోహిణి సీటును 12 వేలకు పైగా ఓట్లతో గెలుచుకున్నారు. 2015 నుండి ప్రతిపక్షంలో కూర్చొని ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా నిరంతరం తన గళాన్ని వినిపిస్తున్న విజేందర్ గుప్తా ఇప్పుడు స్పీకర్ కుర్చీపై కూర్చోనున్నారు. ఇప్పుడు ఆయన ఏ కుర్చీ నుంచి సభ నుంచి బయటకు పంపించారో అదే కుర్చీలో కూర్చుంటారు. తన పేరు ఖరారు అయిన తర్వాత విజేంద్ర గుప్తా ముందుగా సభలో CAG నివేదికను ప్రవేశపెడతామని చెప్పారు. దీనిని గత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది.
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!