Mullah Yaqoob: భారత్ ఆఫ్ఘన్కు సపోర్ట్ చేసిందా..? క్లారిటీ ఇచ్చిన ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Defence Minister Mullah Yaqoob: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత్ కీలక పాత్ర పోషించిందని పాక్ రక్షణ మంత్రి పిచ్చికూతలు కూశారు. ఈ వాదనలను తాజాగా ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ ఖండించారు. అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాకూబ్ ఈ ఆరోపణలను నిరాధారంగా పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఈ వాదనలు నిరాధారమైనవి. మా భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించాలనే విధానం మాకు లేదు. మనది స్వతంత్ర దేశం. భారతదేశం, పాకిస్థాన్లతో మన సంబంధాలు పూర్తిగా జాతీయ ప్రయోజనాల ద్వారానే మార్గనిర్దేశం చేయబడ్డాయి” అని స్పష్టం చేశారు.
READ MORE: Rashmika: థామా జర్నీ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది..
Also Read
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
కాగా.. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాకి భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. మంత్రి భారత పర్యటనలో ఉండగానే అక్టోబర్ 11న కాబూల్లో పేలుళ్లు జరిగాయి. ఒక రోజు తరువాత పాకిస్థాన్ దక్షిణ సరిహద్దులో తాలిబాన్ యోధులు దాడులు ప్రారంభించారు. ఈ దాడులపై ఇస్లామాబాద్ స్పందించింది. సరిహద్దులో జరుగుతున్న కాల్పుల్లో భారత్ పాత్ర ఉందంటూ పాక్ నిందించింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాలిబన్ నాయకత్వం భారత్ ఒడిలో కూర్చొందని.. సరిహద్దుల్లో సరిహద్దు ఉగ్రవాదానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందిస్తూ.. భారత MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. “పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు ఆతిథ్యం ఇస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలను స్పాన్సర్ చేస్తుంది. దాని స్వంత అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించడం పాకిస్థాన్ కొత్తేం కాదు. ఆఫ్ఘనిస్థాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమాధికారాన్ని వినియోగించుకోవడం పట్ల పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి పూర్తిగా కట్టుబడి ఉంది.” అని ఘాటుగా రిప్లై ఇచ్చారు.
READ MORE: Botsa Satyanarayana: త్వరలోనే రాజయ్యపేటకు జగన్.. ప్రభుత్వంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!