Boat Capsized : నది దాటుతుండగా బోటు బోల్తా .. 20 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Capsized : తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఇక్కడ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. దీంతో అక్కడ కలకలం రేగింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 20 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై తాలిబన్ అధికారి ఒకరు సమాచారం అందించారు. మహ్మంద్ దారా జిల్లాలో నది దాటుతుండగా బోటు బోల్తా పడిందని, దీంతో బోటులో ఉన్న వారంతా మునిగిపోయారని నంగర్హర్ ప్రావిన్స్లోని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు.
ఈ ప్రమాదంలో నీటిలో మునిగి 20 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. బోటులో 25 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని గ్రామస్తులు తెలిపారు. ఆ ప్రజలు ఎలాగో నీటిలోంచి ఈదుకుంటూ బయటపడ్డారు. మృతుల్లో ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
Read Also:T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం!
ఐదు మృతదేహాలు వెలికితీత
నంగర్హార్ ఆరోగ్య శాఖ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఒక పురుషుడు, ఒక మహిళ, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయితో సహా ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న సహాయక సిబ్బంది మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల గందరగోళం నెలకొంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలీదు
వైద్య బృందం, అంబులెన్స్తో పాటు అవసరమైన అన్ని వస్తువులను ఆ ప్రాంతానికి పంపినట్లు తాలిబాన్ అధికారి తెలిపారు. పడవ బోల్తా పడటానికి గల కారణాలేంటో చెప్పలేదు. మరోవైపు ప్రమాద సమాచారం అందిన వెంటనే మృతుల బంధువుల్లో రోదనలు మిన్నంటాయి. దీంతో బాధితుల ఇళ్లలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు తరచుగా ఇతర గ్రామాలకు, స్థానిక మార్కెట్లకు వెళ్లడానికి పడవలో ప్రయాణిస్తుంటారని చెబుతున్నారు. పడవల సహాయంతో మాత్రమే ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళతారు.
Read Also:Assam Floods: అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!