Adarsha Kutumbam: గురూజీ మారిపోయాడా?

Adarshaa

Adarshaa

ఆదర్శ కుటుంబం గ్లిమ్స్ చూస్తుంటే గురూజీ మారిపోయాడు అనిపిస్తోంది. ‘అల వైకుంఠపురములో’ చెప్పిన మెసేజ్‌ని రివర్స్ లో చెబుతున్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి.  ‘గుంటూరు కారం’ రిలీజ్ తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకున్న గురూజీ వెంకటేష్‌తో ‘ఆదర్శ కుటుంబం’ తీస్తున్నాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి పోషించిన ‘స్వర్ణ’ రోల్‌ను పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ ఆడవాళ్ళ గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు రివర్స్ లో ‘ఆదర్శ కుటుంబం’ ఉంటుందనిపిస్తుంది. “ఆడవాళ్ళతో గొడవ ఏంటి? జస్ట్ సరెండర్ అయిపోవాలంతే” అని ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ డైలాగ్ ఉంటే, “ఈ ఆడవాళ్ళకు ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు” అంటాడు వెంకటేష్. హీరోయిన్ క్యారెక్టర్ రీత్యా గురూజీ ఈ డైలాగ్ రాసినా, ‘అల వైకుంఠపురములో’కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. రిలీజ్‌కు మూడు నెలలు ఉండగా, ముందుగా హీరో చిట్టిబాబు రోల్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. వారం కూడా గ్యాప్ లేకుండా మరుసటి రోజే హీరోయిన్ గ్లిమ్స్ రిలీజ్ చేయడం విశేషం. నెక్స్ట్ ఏ క్యారెక్టర్ ను పరిచయం చేస్తాడో చూడాలి మరి. అయితే గ్లిమ్స్ ఎండింగ్ లో నారా రోహిత్ సత్యను కూడా ఇంట్రడ్యూస్ చేయగా, ‘ఆదర్శ కుటుంబం’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.