Adani Group : రూ.3000కోట్లతో రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani Group : గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ రక్షణ రంగంలో భారీ ప్రకటన చేసింది. 3000 కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ రెండు ఆయుధ కర్మాగారాలను ఏర్పాటు చేయనుంది. ఈ ఫ్యాక్టరీలను ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నిర్మించనున్నారు. ఇక్కడ మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు. ఈ కర్మాగారాల్లో ఏటా దాదాపు 15 కోట్ల మందుగుండు సామగ్రిని తయారు చేయవచ్చు, ఇది భారత సైన్యానికి అవసరమైన మొత్తంలో నాలుగో వంతు. ఇది దేశంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్థానిక తయారీని ప్రోత్సహిస్తుంది.
కాన్పూర్ సమీపంలో దాదాపు 500 ఎకరాల్లో అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ ఈ ఫ్యాక్టరీలను నిర్మించనుంది. భారత ఆర్మీ అవసరాలను తీర్చడంలో ఈ ఫ్యాక్టరీలు కీలక పాత్ర పోషిస్తాయని గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ సోమవారం తెలిపారు. చిన్న, మధ్య , పెద్ద క్యాలిబర్ మందుగుండు సామగ్రిని వీటిలో తయారు చేయవచ్చు. వీటిని సైన్యం, పారా మిలటరీ, పోలీసులకు సరఫరా చేస్తారు. డిఫెన్స్ వ్యాపారాన్ని కరణ్ అదానీ చూస్తున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Read Also:CM Revanth Reddy: సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఈ ఫ్యాక్టరీల సాయంతో దాదాపు 4000 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. 2025 నాటికి 2 లక్షల రౌండ్ల పెద్ద క్యాలిబర్ ఫిరంగి, ట్యాంక్ షెల్స్ను ఇక్కడ తయారు చేయవచ్చు. అలాగే, 50 లక్షల రౌండ్ల మీడియం క్యాలిబర్ షెల్స్ను తయారు చేయవచ్చు. ఇక్కడ షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ తయారు చేయవచ్చు. అదానీ డిఫెన్స్ ఇంతకుముందు డ్రోన్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్, లైట్ మెషిన్ గన్స్, అసాల్ట్ రైఫిల్స్, పిస్టల్స్ తయారు చేసింది.
రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రక్షణ రంగంలో బిలియన్ల డాలర్ల వ్యాపారానికి దారులు తెరుచుకున్నాయి. అదానీ గ్రూప్, టాటా గ్రూప్, లార్సెన్ & టూబ్రో, మహీంద్రా గ్రూప్ భారత సైన్యం అవసరాలను తీర్చడానికి వేగంగా పని చేస్తున్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరణ్ అదానీ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో విదేశీ ఆధారపడటం వల్ల భారత సైన్యం అవసరాలు సకాలంలో తీరడం లేదని అన్నారు. అదనంగా, ఆర్థిక అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి.
Read Also:Elon Musk : లింక్డ్ఇన్లా పని చేయనున్న ట్విటర్.. 10 లక్షల ఉద్యోగాలకు అవకాశం
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!