Adani Group : రూ.3000కోట్లతో రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani Group : గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ రక్షణ రంగంలో భారీ ప్రకటన చేసింది. 3000 కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ రెండు ఆయుధ కర్మాగారాలను ఏర్పాటు చేయనుంది. ఈ ఫ్యాక్టరీలను ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నిర్మించనున్నారు. ఇక్కడ మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు. ఈ కర్మాగారాల్లో ఏటా దాదాపు 15 కోట్ల మందుగుండు సామగ్రిని తయారు చేయవచ్చు, ఇది భారత సైన్యానికి అవసరమైన మొత్తంలో నాలుగో వంతు. ఇది దేశంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్థానిక తయారీని ప్రోత్సహిస్తుంది.
కాన్పూర్ సమీపంలో దాదాపు 500 ఎకరాల్లో అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ ఈ ఫ్యాక్టరీలను నిర్మించనుంది. భారత ఆర్మీ అవసరాలను తీర్చడంలో ఈ ఫ్యాక్టరీలు కీలక పాత్ర పోషిస్తాయని గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ సోమవారం తెలిపారు. చిన్న, మధ్య , పెద్ద క్యాలిబర్ మందుగుండు సామగ్రిని వీటిలో తయారు చేయవచ్చు. వీటిని సైన్యం, పారా మిలటరీ, పోలీసులకు సరఫరా చేస్తారు. డిఫెన్స్ వ్యాపారాన్ని కరణ్ అదానీ చూస్తున్నారు.
Also Read
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
- Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
Read Also:CM Revanth Reddy: సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఈ ఫ్యాక్టరీల సాయంతో దాదాపు 4000 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. 2025 నాటికి 2 లక్షల రౌండ్ల పెద్ద క్యాలిబర్ ఫిరంగి, ట్యాంక్ షెల్స్ను ఇక్కడ తయారు చేయవచ్చు. అలాగే, 50 లక్షల రౌండ్ల మీడియం క్యాలిబర్ షెల్స్ను తయారు చేయవచ్చు. ఇక్కడ షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ తయారు చేయవచ్చు. అదానీ డిఫెన్స్ ఇంతకుముందు డ్రోన్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్, లైట్ మెషిన్ గన్స్, అసాల్ట్ రైఫిల్స్, పిస్టల్స్ తయారు చేసింది.
రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రక్షణ రంగంలో బిలియన్ల డాలర్ల వ్యాపారానికి దారులు తెరుచుకున్నాయి. అదానీ గ్రూప్, టాటా గ్రూప్, లార్సెన్ & టూబ్రో, మహీంద్రా గ్రూప్ భారత సైన్యం అవసరాలను తీర్చడానికి వేగంగా పని చేస్తున్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరణ్ అదానీ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో విదేశీ ఆధారపడటం వల్ల భారత సైన్యం అవసరాలు సకాలంలో తీరడం లేదని అన్నారు. అదనంగా, ఆర్థిక అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి.
Read Also:Elon Musk : లింక్డ్ఇన్లా పని చేయనున్న ట్విటర్.. 10 లక్షల ఉద్యోగాలకు అవకాశం
తాజావార్తలు
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
-
Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్లో
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!