Adani Group : రూ.3000కోట్లతో రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani Group : గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ రక్షణ రంగంలో భారీ ప్రకటన చేసింది. 3000 కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ రెండు ఆయుధ కర్మాగారాలను ఏర్పాటు చేయనుంది. ఈ ఫ్యాక్టరీలను ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నిర్మించనున్నారు. ఇక్కడ మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు. ఈ కర్మాగారాల్లో ఏటా దాదాపు 15 కోట్ల మందుగుండు సామగ్రిని తయారు చేయవచ్చు, ఇది భారత సైన్యానికి అవసరమైన మొత్తంలో నాలుగో వంతు. ఇది దేశంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్థానిక తయారీని ప్రోత్సహిస్తుంది.
కాన్పూర్ సమీపంలో దాదాపు 500 ఎకరాల్లో అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ ఈ ఫ్యాక్టరీలను నిర్మించనుంది. భారత ఆర్మీ అవసరాలను తీర్చడంలో ఈ ఫ్యాక్టరీలు కీలక పాత్ర పోషిస్తాయని గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ సోమవారం తెలిపారు. చిన్న, మధ్య , పెద్ద క్యాలిబర్ మందుగుండు సామగ్రిని వీటిలో తయారు చేయవచ్చు. వీటిని సైన్యం, పారా మిలటరీ, పోలీసులకు సరఫరా చేస్తారు. డిఫెన్స్ వ్యాపారాన్ని కరణ్ అదానీ చూస్తున్నారు.
Also Read
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
Read Also:CM Revanth Reddy: సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఈ ఫ్యాక్టరీల సాయంతో దాదాపు 4000 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. 2025 నాటికి 2 లక్షల రౌండ్ల పెద్ద క్యాలిబర్ ఫిరంగి, ట్యాంక్ షెల్స్ను ఇక్కడ తయారు చేయవచ్చు. అలాగే, 50 లక్షల రౌండ్ల మీడియం క్యాలిబర్ షెల్స్ను తయారు చేయవచ్చు. ఇక్కడ షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ తయారు చేయవచ్చు. అదానీ డిఫెన్స్ ఇంతకుముందు డ్రోన్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్, లైట్ మెషిన్ గన్స్, అసాల్ట్ రైఫిల్స్, పిస్టల్స్ తయారు చేసింది.
రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రక్షణ రంగంలో బిలియన్ల డాలర్ల వ్యాపారానికి దారులు తెరుచుకున్నాయి. అదానీ గ్రూప్, టాటా గ్రూప్, లార్సెన్ & టూబ్రో, మహీంద్రా గ్రూప్ భారత సైన్యం అవసరాలను తీర్చడానికి వేగంగా పని చేస్తున్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరణ్ అదానీ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో విదేశీ ఆధారపడటం వల్ల భారత సైన్యం అవసరాలు సకాలంలో తీరడం లేదని అన్నారు. అదనంగా, ఆర్థిక అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి.
Read Also:Elon Musk : లింక్డ్ఇన్లా పని చేయనున్న ట్విటర్.. 10 లక్షల ఉద్యోగాలకు అవకాశం
తాజావార్తలు
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?