NTV Telugu Site icon

Ujjain Temple: మహా శివుడి భస్మహారతిలో హీరోయిన్స్..

Ujjain Temple

Ujjain Temple

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతిరోజూ సినీ తారలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా ఆనేలకా వేలమంది వస్తుంటారు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్, పరిణీతి చోప్రా, గాయకుడు జుబిన్ నౌటియల్, క్రికెటర్ కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, గాయకుడు షెహనాజ్ అక్తర్, నటుడు గోవింద, హేమమాలిని, ప్రముఖ గాయకుడు హన్సరాజ్ రఘువంశీ, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, నటుడు అన్షుమన్ ఖురానా, హాస్యనటుడు భారతి, సునీల్ శెట్టి, విరాట్ కోహ్లీ దంపతులు ఇలా అనేకమంది మహాకేశ్వరుడుని చూడటానికి వస్తారు.

Rinku Singh: మౌనం వీడిన రింకూ.. ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటు దక్కపోవడంపై రోహిత్ అలా అన్నాడా..

ఇకపోతే తాజాగా భస్మ ఆరతి సమయంలో, ఇద్దరు నటీమణులిద్దరూ శివుడిని పఠిస్తూ కనిపించారు. నటీమణులిద్దరూ తెల్లవారుజామున 3 గంటలకు భస్మ హారతి కోసం ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారని, సాధారణ భక్తుల మాదిరిగానే దర్శనం చేసుకున్నారని తెలుస్తోంది. ఉజ్జయినిలో భస్మ ఆరతి ముగిసిన తర్వాత, బాలీవుడ్ నటీమణులు వాణి కపూర్, రాశీ ఖన్నా గర్భ గుడిలో మహాకాలేశ్వరుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూజలు నిర్వహించారు.

Karnataka: భార్యతో గొడవ.. తల నరికి, ముక్కలు ముక్కలు చేసిన భర్త..

ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ సముదాయంలో మహాకాల్ మహాలోక్ నిర్మించినప్పటి నుండి సందర్శకుల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. శ్రీ మహాకాళేశ్వర ఆలయ నిర్వహణ కమిటీ ప్రకారం., సాధారణంగా ప్రతిరోజూ మహాకాళేశ్వరాలయానికి 1.5 లక్షల నుండి 2 లక్షల మంది భక్తులు వస్తుంటారు. అయితే ప్రత్యేక పండుగ రోజులు, సెలవు దినాలలో భక్తుల సంఖ్య అనేక రెట్లు పెరుగుతుందని వారు తెలిపారు.