Meenakshi Seshadri: హీరోల సుదీర్ఘ కెరీర్కు ఆ మూడే కారణాలు.. మీనాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు!
- 90వ దశకంలో సూపర్హిట్ కథానాయిక
- బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించారు
- 13 ఏళ్ల కెరీర్లో 70 సినిమాలు
Meenakshi Seshadri About Re Entry: 90వ దశకంలో సూపర్హిట్ కథానాయికలలో ‘మీనాక్షి శేషాద్రి’ ఒకరు. ‘దామిని’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. ఇక 1991లో ‘బ్రహ్మశ్రీ విశ్వామిత్ర’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. చిరంజీవి హీరోగా 1992లో వచ్చిన ‘ఆపద్బాంధవుడు’తో మరింత దగ్గరయ్యారు. మీనాక్షి తన 13 ఏళ్ల కెరీర్లో 70 సినిమాల్లో నటించారు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. 1995లో హరీష్ మైసూర్ను పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు.
2016లో విడుదలైన ‘గాయల్ వన్స్ అగైన్’లో మీనాక్షి శేషాద్రి అతిథి పాత్రలో కనిపించారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉన్న మీనాక్షి.. 60 ఏళ్ల వయసులోనూ కమ్బ్యాక్ ఇవ్వడానికి సిద్దమయ్యారు. తాజాగా లెహరెన్ రెట్రోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సీనియర్ నటి చాలా విషయాలపై స్పందించారు. కమ్బ్యాక్ ఇవ్వడానికి సిద్దమయ్యానని, మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. తనకోసం స్క్రిప్ట్ రాయాలని నిర్ణయించుకునే ముందు.. ఈ రోజుల్లో తాను ఎలా ఉన్నానో, ఎలాంటి పాత్రకు సెట్ అవుతానో అని తెలుసుకోవాలన్నారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Also Read: Keerthy Suresh: ఆ విషయంలో అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న నటిని నేనే: కీర్తి సురేశ్
హీరోల సుదీర్ఘ కెరీర్కు కారణం ఏంటో మీనాక్షి శేషాద్రి వివరించారు. ‘ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్తో పాటు ఆ తరానికి చెందిన నటులు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కథానాయికలతో పోలిస్తే హీరోలకు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కెరీర్ ఉండటానికి చాలా కారణాలున్నాయి. ఇంటి పనులు చేసేది పురుషులు కాదు. ప్రెగ్నెన్సీ, పిల్లలకు జన్మనివ్వడం, పిల్లలను పెంచడం వంటి విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవన్నీ స్త్రీ బాధ్యతలు. హీరోలకు ఎంత వయసు వచ్చినా తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు’ అని మీనాక్షి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో