Shraddha Walker Case: అధిక భద్రతల నడుమ అఫ్తాబ్కు మళ్లీ పాలిగ్రాఫ్ పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Walker Case: సహజీవనం చేస్తున్న ప్రియురాలిని పాశవికంగా హత్య చేసి 35 ముక్కలు చేసిన అఫ్తాబ్ పూనావాలాకు ఈ రోజు మళ్లీ పాలిగ్రాఫ్ పరీక్షలు చేయనున్నారు. ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్సెస్ లాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకు ముందు పాలిగ్రాఫ్ చేసే సమయంలో జ్వరం వచ్చిందని అఫ్తాభ్ అధికారులకు తెలపడంతో మధ్యలోనే నిలిపివేశారు. ఈ రోజు జరిపే పరీక్షల్లో అధికారులు అఫ్తాబ్ను ప్రశ్నించనున్నారు. శ్రద్ధా వాకర్ పుర్రె, మరికొన్ని అవయవాలు ఎక్కడ పడేశాడు? అని ప్రశ్నించనున్నారు.
ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా మంగళవారం ఐదోసారి దేశ రాజధాని ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) కార్యాలయానికి అత్యంత భద్రత మధ్య తీసుకెళ్లారు. అతనిని తీసుకెళ్తున్న ఢిల్లీ పోలీసు వ్యాన్పై సోమవారం కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. పాలిగ్రాఫ్ పరీక్షల కోసం ఆఫ్తాబ్ను తీసుకువచ్చిన ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం వెలుపల భద్రత కోసం సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది మోహరించారు. ఈ ఏడాది మేలో అఫ్తాబ్ తన లైవ్-ఇన్ భాగస్వామి శ్రద్ధను గొంతుకోసి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి చంపిన కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తరిగిన శరీర భాగాలను ఢిల్లీ, గురుగ్రామ్లోని అటవీ ప్రాంతాల్లో పడేసే ముందు రిఫ్రిజిరేటర్లో భద్రపరిచాడని కూడా ఆరోపణలు వచ్చాయి. అఫ్తాబ్ ప్రశ్నలకు తప్పుదారి పట్టించే సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు గతంలో కోర్టులో సమర్పించారు.
Also Read
- Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
- భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
Hyderabad School Case: దారుణం.. తోటి విద్యార్థులే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
ఆఫ్తాబ్ పాలిగ్రాఫ్ పరీక్ష మంగళవారం కూడా కొనసాగవచ్చని సోమవారం ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా వెల్లడించారు. సోమవారం సాయంత్రం అఫ్తాబ్ను పాలిగ్రాఫ్ పరీక్షలు చేసిన తర్వాత పోలీసులు ఎస్కార్ట్ చేస్తున్నప్పుడు, ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం వెలుపల కొంతమంది కత్తి పట్టుకున్న వ్యక్తులు ఆఫ్తాబ్ను తీసుకువెళుతున్న పోలీసు వ్యాన్పై దాడికి ప్రయత్నించారు. ఆఫ్తాబ్కు నార్కోఅనాలిసిస్ పరీక్ష నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే, పాలిగ్రాఫ్ పరీక్ష చేసిన తర్వాత మాత్రమే పరీక్ష నిర్వహించబడుతుంది. ఇదిలా ఉండగా.. అఫ్తాబ్ నార్కో టెస్ట్ డిసెంబర్ 5న జరిగే అవకాశం ఉంది. నార్కో పరీక్ష కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదని బాబా సాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ నవనీత్ గోయెల్ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ నుండి అభ్యర్థన తర్వాత వచ్చే సోమవారం ఇది జరుగుతుందని తాము ఆశిస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!