Krishnapatnam Port: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్టులో జరిగిన ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇండోనేషియా నుంచి ఓ నౌక బొగ్గు లోడ్తో వచ్చింది. నౌకలోని ట్యాంకర్ను క్యాజువల్ ఉద్యోగులు క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది. ఈ దుర్ఘటనలో క్యాజువల్ ఉద్యోగులు ఖదీర్, ప్రశాంత్లు మృతి చెందగా.. మరికొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోర్టులోని ఆరో బెర్త్లోని షిప్లో ఇద్దరు శ్వాస అందక చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also: Volunteer: రైల్వేపట్టాలపై వాలంటీర్ మృతదేహం.. అసలేం జరిగిందంటే?
