ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కే రిజర్వ్ డే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే లీగ్ దశలో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఫలితం తేలేలా రిజర్వు డేని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కొలంబోలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సెప్టెంబర్ 10న జరగాల్సిన ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్లో ఫలితం తేలడం కూడా కష్టమే.. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలో నిలిచిపోతే, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి సెప్టెంబర్ 11న జరుగనుంది.
Chandramukhi 2 : గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ డైరెక్టర్..?
మరోవైపు కేవలం ఇండియా-పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్కి మాత్రమే రిజర్వ్ డే కేటాయించగా.. మిగిలిన మ్యాచులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. సెప్టెంబర్ 9న శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరుగనుంది. అయితే ఇదే వేదికలో సెప్టెంబర్ 10న ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 9 మ్యాచ్కి అంతరాయం కలిగితే రిజర్వు డే కేటాయించడం కష్టం. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 12న ఇండియా- శ్రీలంక మ్యాచ్ కూడా జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత సెప్టెంబర్ 13న మ్యాచులేమీ లేవు. దీంతో అవసరమైతే రిజర్వు డే కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే అలా చేస్తే టీమిండియా వరుసగా 4 రోజులు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.
Bhumana Karunakar Reddy: వరుణ యాగానికి సాయంత్రం అంకురార్పణ
సెప్టెంబర్ 10న పాకిస్తాన్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత వర్షం పడితే.., రిజర్వు డే సెప్టెంబర్ 11న టీమిండియా బ్యాటింగ్ చేయాలి. సెప్టెంబర్ 12న టీమిండియా బ్యాటింగ్ ముగిశాక వర్షం పడితే, మళ్లీ రిజర్వు డే సెప్టెంబర్ 13న ఆడాలి.. ఇలా వరుసగా నాలుగు రోజులు ఆడాలి. అయితే వన్డే వరల్డ్ కప్ టోర్నీ ముందు ఇలాంటి ప్రయోగాలు చేయడం కూడా కరెక్ట్ కాదని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్కి కూడా రిజర్వు డే ఉండనుంది. అయితే దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా క్లారిటీ లేదు.