UIDAI: విదేశీయులు కూడా ఆధార్ కార్డు పొందవచ్చు.. కానీ..
- ఆధార్ కార్డు పౌరసత్వానికి ఆధారం కాదని యుఐడీఏఐ స్పష్టం
- చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించిన నాన్ రెసిడెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన
- ఆధార్ దేశంలో ఓ వ్యక్తి నివాస ప్రాంతాన్ని ధ్రువీకరించేదన్న యుఐడీఏఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ కార్డు పౌరసత్వానికి ఆధారం కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) కలకత్తా హైకోర్టుకు తెలిపింది. చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించిన నాన్ రెసిడెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని.. ఆధార్ పొందవచ్చని యుఐడీఏఐ (UIDAI) పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివగణం, జస్టిస్ హిరణ్మోయ్ భట్టాచార్యలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఈ వాదనలు జరిగాయి. పౌరసత్వంతో దానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దేశంలో ఓ వ్యక్తి నివాస ప్రాంతాన్ని ధ్రువీకరించేది మాత్రమేనని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో అనేక ఆధార్ కార్డులను అకస్మాత్తుగా డీయాక్టివేట్ చేయడం, తిరిగి యాక్టివేట్ చేయడాన్ని సవాలు చేస్తూ..వేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి.
READ MORE: Brain-Eating Amoeba: ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ .. కేరళలో 4వ కేసు నమోదు..
Also Read
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
ఆధార్ నిబంధనలలోని 28 ఏ(A), 29 నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్ తరఫు న్యాయవాది జుమా సేన్ సవాలు చేశారు. ‘ఆధార్ చాలా పెద్ద విషయం. పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆధార్ అవసరం. జనన ధృవీకరణ పత్రం ఆధార్ తప్పనిసరి. కాబట్టి ఆధార్ లేకుండా ఒక వ్యక్తి చనిపోలేడు. జననం నుంచి మరణం వరకు అన్నీ ఆధార్ తో ముడిపడి ఉన్నాయి.” అని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
READ MORE: Vizag: కిడ్నీ రాకెట్ కేసులో మాకేమీ సంబంధం లేదు: క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేనేజర్
యుఐడీఏఐ సీనియర్ న్యాయవాది లక్ష్మీ గుప్తా పిటిషనర్ల హక్కులను సవాలు చేస్తూ తన వాదనలు వినిపించారు. తమను ‘అన్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్’ అని.. అలాంటి వాదనను అంగీకరించబోమని చెప్పారు. ఆధార్ కార్డులకు పౌరసత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ రాయితీలు పొందేందుకు విదేశీ పౌరులకు నిర్ణీత సమయం వరకు ఇవ్వవచ్చని తెలిపారు. ఈ వాదన దేశీయ పౌరులు కానివారికి, చాలా వరకు బంగ్లాదేశ్ పౌరులకు అనుకూలంగా ఉన్నందున ఇది ఆమోదయోగ్యం కాదని కూడా వాధించారు. వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో ఎక్కువ కాలం ఉంటున్న విదేశీయుల ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేసే అధికారం UIDAIకి ఉందని గుప్తా వివరించారు.
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్ కుమార్ చక్రవర్తి వాదనలు వినిపించారు. ఆధార్ చట్టంలోని సెక్షన్ 54ను సవాల్ చేయనందున పిటిషనర్ల ఈ వాదనను అంగీకరించబోమని కేసు విచారణ తేదీని పొడిగించాలని కోరారు. దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయలేరని పిటిషన్ను కొనసాగించడం సాధ్యం కాదని సమర్పించారు.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!