Viral : చిన్న పొరపాటు.. బ్రతికున్న మనిషిని చంపేశారు రైల్వే పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా తాండూరులో చోరీకి గురైన ఫోను ఆ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసింది. ఫోను చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా భావించారు. అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కడసారి చూపు చూ చూసేoదుకని బంధువులు మిత్రులు అందరూ వచ్చేశారు. అంత్యక్రియలకు తరలించేందుకు పాడి ఎక్కించే సమయంలో అసలు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అది చూసి కుటుంబ సభ్యులు బంధువులు అంతా అవాక్కైపోయారు. వివరాలలోకి వెళితే…. బషీరాబాద్ మండలం నా వంద్గి గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప (45) పశువుల కాపరిగా పనిచేసేవాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయాడు. అయితే అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఫోన్ దొంగిలించిన వ్యక్తి వికారాబాద్ సమీపంలో రైలు కిందపడి చనిపోయాడు. అతడి మొఖం పూర్తిగా చిద్ర మైపోయి ఎవరు గుర్తుపట్టలేని విధంగా తయారయింది. రైల్వే పోలీసులు గమనించి అతడి వద్ద ఐడెంటిటీ కోసం తనిఖీ చేయగా ఫోన్ లభించింది. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా నావంద్గీ గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించిన గుర్తుపట్టలేని విధంగా శవం ఉండడంతో కుటుంబ సభ్యులుఇంటికి తీసుకువచ్చారు.
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ఎల్లప్ప చనిపోయిన విషయం బంధుమిత్రులందరికీ సమాచారం అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు గుంతను తవ్వి అంత సిద్ధం చేశారు. నావంద్గి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చనిపోయాడ నుకున్న పిట్టల ఎల్లప్ప తాండూరులో తారసపడ్డాడు. అతనిని చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దగ్గరికి వెళ్లి అతడిని పలకరించాడు. నువ్వు చనిపోయావు అనుకుని ఎవరిదో శవాన్ని తీసుకువచ్చి మీ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారని చెప్పడంతో అతడు అవ్వక్కయ్యాడు. అదే వ్యక్తితో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి తాను బతికి ఉన్నట్లు తెలిపాడు. హుటాహుటిన గ్రామానికి వెళ్లి పోయాడు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి ప్రత్యక్షం కావడంతో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు అంత అవాక్కైపోయారు. వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!