టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’.ఈ చిత్రానికి జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు.ఈ సినిమాను వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు.గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ మూవీ సూపర్ హిట్ అయింది.ఇప్పుడు ఆ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా “ప్రతినిధి 2 ” మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో నటించాడు. సిరీ లెల్లా ఈ సినిమాకు హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రలలో నటించారు. యంగ్ మ్యూజిక్ డిఏక్టర్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.
రిలీజ్ కు సిద్దమైన ఈ సినిమాకు అడుగడుగున ఇబ్బందులు తలెత్తుతున్నాయి .ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 25 న విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు .కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మే 3 కు వాయిదా పడింది.అయితే ఈ సినిమా సెన్సార్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా మే 10 వ తేదికి వాయిదా పడింది.తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అయింది.అయితే నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమాను నిలిపివేయాలని వైసీపీ ఈసీని కోరింది.ఈ చిత్రం టీడీపీకి అనుకూలంగా ప్రభావితం చేసేలా ఉందని ఆ పార్టీ గ్రీవెన్స్ చైర్మన్ నారాయణమూర్తి ,లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేసారు.ఈ చిత్రం ఎన్నికలలో ప్రజలను ప్రభావితం చేస్తుంది అని వారు తెలిపారు.