NTV Telugu Site icon

Vijayawada: కుమార్తె కళ్లెదుటే తండ్రిని చంపేసిన ప్రేమోన్మాది

Vja

Vja

విజయవాడ నగరంలోని బృందావన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సింధు భవన్ దగ్గర కిరాణా షాపు వ్యాపారి హత్య జరిగింది. వ్యాపారి కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. సదరు యువకుడిని ఆ కిరాణం షాప్ యాజమాని మందలించడంతో దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. షాపు మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో కత్తితో ప్రేమోన్మాది మణికంఠ దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు.

Read Also: Telecom tariffs: జియో దారిలోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా..యూజర్లకు షాక్..

అయితే, గురువారం రాత్రి శ్రీరామ్ ప్రసాద్ను మణికంఠ దారుణంగా చంపేశాడు. తన కూతురు వెంటపడొద్దన్నందుకు ఈ హత్య చేసినట్లు సదరు యువకుడు పేర్కొన్నాడు. తన తండ్రిని చంపొద్దు అని యువతి దర్శి వేడుకుంటున్నా.. కూడా ఆ యువకుడు కనికరించకుండా శ్రీరామ్ ప్రసాద్ ను కత్తితో దారుణంగా పొడిచాడు.. దీంతో తీవ్ర రక్తస్త్రావం కావడంతో రోడ్డుపై శ్రీరామ్ ప్రసాద్ పడిపోయి మరణించాడు. అయితే, మణికంఠ ప్రైవేట్ స్కూల్లో డ్రిల్ మాస్టర్గా పని చేస్తున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న కృష్ణలంక పోలీసులు.. మణికంఠ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.