Murder: అందరూ చూస్తుండగానే కాల్పులు.. ఆపై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా మహారాష్ట్రలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. సోలాపూర్ – పూణే జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. హైవే లో ఉన్న ఓ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి కాల్పులు చేశారు. ఒక వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ టేబుల్ వద్ద ఉండగా.. అక్కడికి ఆ వ్యక్తి పై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే టేబుల్ పై కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత మరికొందరు దండగులు రాగా వారు కత్తితో విచక్షణా రహితంగా పొడిచారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రెస్టారెంట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజీల్లో నమోదయ్యాయి. ఇవి కాస్త సోషల్ మీడియాలో రాగా బాగా వైరల్ గా మారాయి.
Also Read: Viral News: ‘‘గూగుల్ ఈజ్ రాంగ్’’.. ప్రయాణికుల్ని హెచ్చరించేందుకు సైన్బోర్డ్..
Also Read
- YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
ఇక మృతుడి విషయానికి వస్తే.. 34 యేళ్ల రియల్ ఎస్టేట్ చేసే అవినాశ్ బాలు ధాన్వేగా గుర్తించారు. ఈ కాల్పులు రెండు గ్యాంగుల మధ్య శత్రుత్వంగా పోలీసులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు . హత్య జరిగిన సమయంలో ధాన్వేతోపాటు మరో వ్యక్తులు రెస్టారెంట్ లోని టేబుళ్ల వద్ద కూర్చొని ఉన్నారు. అంతే కాదు వారి సమీపంలో మరో టేబుల్ వద్ద ఇద్దరు పిల్లలతో కూడిన ఓ కుటుంబం భోజనం చేస్తుంది కూడా. మొదటగా ఓ ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుచుకుంటూ రెస్టారెంట్ లోకి రాగా.. వారిలో ఒకరి చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉన్నట్లు గమనించవచ్చు. ఆ తర్వాత తుపాకులు తీసి అక్కడే ఫోనులో మాట్లాడుతున్న ధాన్వే తలపై కాల్పులు జరిపారు. ఆ దెబ్బకి భయపడిన ధాన్వే, అతనితో కలిసి ఉన్న ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.
Also Read: Praja Galam: చిలకలూరిపేటలో ప్రజాగళం సభ.. మోడీ ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి
ఆ తదుపరి రెస్టారెంట్ లోకి మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రవేశించి నేలపై పడిపోయిన ధాన్వేను పట్టుకుని కత్తితో పొడిచి, ఆ తర్వాత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. దాంతో పక్కనే మరో టేబుల్ లో భోజనం చేస్తున్న ఓ కుటుంబ ప్రాణభయంతో పారిపోవడం కూడా సీసీటీవీ దృశ్యాల్లో గమనించవచ్చు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి., పూర్తి విచారణ జరుపుతున్నారు. హంతకుల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!