Murder: అందరూ చూస్తుండగానే కాల్పులు.. ఆపై..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా మహారాష్ట్రలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. సోలాపూర్ – పూణే జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. హైవే లో ఉన్న ఓ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి కాల్పులు చేశారు. ఒక వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ టేబుల్ వద్ద ఉండగా.. అక్కడికి ఆ వ్యక్తి పై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే టేబుల్ పై కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత మరికొందరు దండగులు రాగా వారు కత్తితో విచక్షణా రహితంగా పొడిచారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రెస్టారెంట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజీల్లో నమోదయ్యాయి. ఇవి కాస్త సోషల్ మీడియాలో రాగా బాగా వైరల్ గా మారాయి.
Also Read: Viral News: ‘‘గూగుల్ ఈజ్ రాంగ్’’.. ప్రయాణికుల్ని హెచ్చరించేందుకు సైన్బోర్డ్..
Also Read
ఇక మృతుడి విషయానికి వస్తే.. 34 యేళ్ల రియల్ ఎస్టేట్ చేసే అవినాశ్ బాలు ధాన్వేగా గుర్తించారు. ఈ కాల్పులు రెండు గ్యాంగుల మధ్య శత్రుత్వంగా పోలీసులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు . హత్య జరిగిన సమయంలో ధాన్వేతోపాటు మరో వ్యక్తులు రెస్టారెంట్ లోని టేబుళ్ల వద్ద కూర్చొని ఉన్నారు. అంతే కాదు వారి సమీపంలో మరో టేబుల్ వద్ద ఇద్దరు పిల్లలతో కూడిన ఓ కుటుంబం భోజనం చేస్తుంది కూడా. మొదటగా ఓ ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుచుకుంటూ రెస్టారెంట్ లోకి రాగా.. వారిలో ఒకరి చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉన్నట్లు గమనించవచ్చు. ఆ తర్వాత తుపాకులు తీసి అక్కడే ఫోనులో మాట్లాడుతున్న ధాన్వే తలపై కాల్పులు జరిపారు. ఆ దెబ్బకి భయపడిన ధాన్వే, అతనితో కలిసి ఉన్న ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.
Also Read: Praja Galam: చిలకలూరిపేటలో ప్రజాగళం సభ.. మోడీ ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి
ఆ తదుపరి రెస్టారెంట్ లోకి మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రవేశించి నేలపై పడిపోయిన ధాన్వేను పట్టుకుని కత్తితో పొడిచి, ఆ తర్వాత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. దాంతో పక్కనే మరో టేబుల్ లో భోజనం చేస్తున్న ఓ కుటుంబ ప్రాణభయంతో పారిపోవడం కూడా సీసీటీవీ దృశ్యాల్లో గమనించవచ్చు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి., పూర్తి విచారణ జరుపుతున్నారు. హంతకుల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!