Supreme Court: ‘మహిళతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా?’..బిభవ్ పై సుప్రీంకోర్టు ఫైర్
- బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ
- బిభవ్ను తీవ్రంగా మందలించిన కోర్టు
- మహిళతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా? అని ప్రశ్న
- బిభవ్ తరపు న్యాయవాదిపై మండిపడ్డ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్పై బిభవ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన గతంలో అరెస్టయ్యారు. నేడు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు బిభవ్ను తీవ్రంగా మందలించింది. ఒక మహిళతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా? అంటూ ప్రశ్నించింది.
READ MORE: Paris Olympics 2024: సాదాసీదాగా వచ్చి.. రజత పతకం గెలిచిన 51 ఏళ్ల టర్కీ షూటర్! అదెలాగబ్బా
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
బిభవ్ తరపున హాజరైన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై మూడు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. మలివాల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తిరిగి వచ్చారన్నారు. చార్జిషీట్పై కోర్టు ప్రశ్నించగా.. మేం సవాల్ చేసిన ఆదేశాల మేరకే చార్జిషీట్ దాఖలు చేశామని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. రెండు హత్య కేసుల్లో నిందితులకు బెయిల్ లభించడాన్ని సింఘ్వి ఉదహరించారు. అయితే ఆ కేసుల గురించి తమకు సూచనలు ఇవ్వొద్దని.. జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.
READ MORE: Paris Olympics 2024: ఫైనల్ కి చేరిన భారత షూటర్ స్వప్నిల్.. ధోని నుంచి ప్రేరణ
” ఆ కేసుల గురించి మాకు సూచనలివ్వొద్దు. ఎందుకంటే ఇక్కడ సంఘటన ఎలా జరిగిందనేది మా ఆందోళనకు కారణం. ఒక స్త్రీతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా? కాంట్రాక్ట్ కిల్లర్లకు, హంతకులకు బెయిల్ ఇస్తాం. కానీ ఈ విషయంలో కాదు.” అని ఘాటుగా స్పందించారు. చాలా కఠినమైన వైఖరిని అవలంబిస్తూ, కోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. బిభవ్ బెయిల్ దరఖాస్తుపై స్పందన కోరింది. తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదీ బుధవారానికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!