Supreme Court: ‘మహిళతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా?’..బిభవ్ పై సుప్రీంకోర్టు ఫైర్
- బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ
- బిభవ్ను తీవ్రంగా మందలించిన కోర్టు
- మహిళతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా? అని ప్రశ్న
- బిభవ్ తరపు న్యాయవాదిపై మండిపడ్డ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్పై బిభవ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన గతంలో అరెస్టయ్యారు. నేడు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు బిభవ్ను తీవ్రంగా మందలించింది. ఒక మహిళతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా? అంటూ ప్రశ్నించింది.
READ MORE: Paris Olympics 2024: సాదాసీదాగా వచ్చి.. రజత పతకం గెలిచిన 51 ఏళ్ల టర్కీ షూటర్! అదెలాగబ్బా
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
బిభవ్ తరపున హాజరైన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై మూడు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. మలివాల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తిరిగి వచ్చారన్నారు. చార్జిషీట్పై కోర్టు ప్రశ్నించగా.. మేం సవాల్ చేసిన ఆదేశాల మేరకే చార్జిషీట్ దాఖలు చేశామని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. రెండు హత్య కేసుల్లో నిందితులకు బెయిల్ లభించడాన్ని సింఘ్వి ఉదహరించారు. అయితే ఆ కేసుల గురించి తమకు సూచనలు ఇవ్వొద్దని.. జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.
READ MORE: Paris Olympics 2024: ఫైనల్ కి చేరిన భారత షూటర్ స్వప్నిల్.. ధోని నుంచి ప్రేరణ
” ఆ కేసుల గురించి మాకు సూచనలివ్వొద్దు. ఎందుకంటే ఇక్కడ సంఘటన ఎలా జరిగిందనేది మా ఆందోళనకు కారణం. ఒక స్త్రీతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా? కాంట్రాక్ట్ కిల్లర్లకు, హంతకులకు బెయిల్ ఇస్తాం. కానీ ఈ విషయంలో కాదు.” అని ఘాటుగా స్పందించారు. చాలా కఠినమైన వైఖరిని అవలంబిస్తూ, కోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. బిభవ్ బెయిల్ దరఖాస్తుపై స్పందన కోరింది. తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదీ బుధవారానికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!