Supreme Court: ‘మహిళతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా?’..బిభవ్ పై సుప్రీంకోర్టు ఫైర్
- బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ
- బిభవ్ను తీవ్రంగా మందలించిన కోర్టు
- మహిళతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా? అని ప్రశ్న
- బిభవ్ తరపు న్యాయవాదిపై మండిపడ్డ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్పై బిభవ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన గతంలో అరెస్టయ్యారు. నేడు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు బిభవ్ను తీవ్రంగా మందలించింది. ఒక మహిళతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా? అంటూ ప్రశ్నించింది.
READ MORE: Paris Olympics 2024: సాదాసీదాగా వచ్చి.. రజత పతకం గెలిచిన 51 ఏళ్ల టర్కీ షూటర్! అదెలాగబ్బా
Also Read
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
- EPFO కీలక నిర్ణయం.. 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం
- PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
బిభవ్ తరపున హాజరైన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై మూడు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. మలివాల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తిరిగి వచ్చారన్నారు. చార్జిషీట్పై కోర్టు ప్రశ్నించగా.. మేం సవాల్ చేసిన ఆదేశాల మేరకే చార్జిషీట్ దాఖలు చేశామని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. రెండు హత్య కేసుల్లో నిందితులకు బెయిల్ లభించడాన్ని సింఘ్వి ఉదహరించారు. అయితే ఆ కేసుల గురించి తమకు సూచనలు ఇవ్వొద్దని.. జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.
READ MORE: Paris Olympics 2024: ఫైనల్ కి చేరిన భారత షూటర్ స్వప్నిల్.. ధోని నుంచి ప్రేరణ
” ఆ కేసుల గురించి మాకు సూచనలివ్వొద్దు. ఎందుకంటే ఇక్కడ సంఘటన ఎలా జరిగిందనేది మా ఆందోళనకు కారణం. ఒక స్త్రీతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా? కాంట్రాక్ట్ కిల్లర్లకు, హంతకులకు బెయిల్ ఇస్తాం. కానీ ఈ విషయంలో కాదు.” అని ఘాటుగా స్పందించారు. చాలా కఠినమైన వైఖరిని అవలంబిస్తూ, కోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది. బిభవ్ బెయిల్ దరఖాస్తుపై స్పందన కోరింది. తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదీ బుధవారానికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
-
Japan Centenarians: జపాన్లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
-
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
-
Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!