Divorce Temple: విడాకుల నిర్ణయం తీసుకునే ఆలయం ఎక్కడుందో తెలుసా?
- జపాన్ లో విడాకుల నిర్ణయం తీసుకునే ఆలయం
- పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divorce Temple: ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేలకొద్దీ దేవాలయాలు ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేక కథ, ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కొన్ని దేవాలయాలు వాటి గొప్ప వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందగా, కొన్ని వాటి మత విశ్వాసాలకు ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలో దేవతలకు, దేవుడులకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. కానీ, ప్రపంచంలోని ప్రత్యేకమైన సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన ఒక ఆలయం ఉంది.
Also Read: Jail Sentence : గంజాయి మొక్కలు సాగు చేసిన వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష..
Also Read
- Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
- KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్పై భారీ విజయం.!
సాధారణంగా, ప్రజలు తమ కోరికలను నెరవేర్చడానికి, దేవుడి ఆశీర్వాదం కోసం దేవాలయాలకు వెళతారు. కానీ, జపాన్లో ఒక ఆలయం ‘ విడాకుల ఆలయం’ అని పిలుస్తారు. గృహ హింస లేదా అఘాయిత్యాలకు గురైన మహిళలకు ఈ ఆలయం స్వర్గధామం. శతాబ్దాల క్రితం జపాన్లో మహిళల హక్కులు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించారని సమాచారం. మహిళలు ఇక్కడికి రావడంతో శారీరకంగా, మానసికంగా కోలుకోవడమే కాకుండా సామాజిక మద్దతు కూడా పొందారు. నేటికీ ఈ ఆలయం మహిళా సాధికారతకు ప్రతీక.
జపాన్ లో మహిళలు ఎటువంటి హక్కులు లేని సమయంలో పురుషులు తమ భార్యలకు సులభంగా విడాకులు ఇచ్చే సమయంలో, ఈ ఆలయం గృహహింసతో బాధపడుతున్న మహిళలకు ఆశ్రయం కల్పించింది. భర్త క్రూరత్వానికి గురై పారిపోతున్న ప్రతి స్త్రీకి గుడి తలుపులు తెరిచి ఉంటాయి. ఇక్కడికి రావడం వల్ల వారికి శారీరక భద్రత మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక శాంతి, సాంత్వన లభించే వాతావరణం కూడా లభించింది. ఈ ఆలయం ఇప్పటికీ అలాంటి అణచివేతలను ఎదుర్కొంటున్న మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇది జపాన్ లోని కమకురా నగరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆలయం. దీని చరిత్ర సుమారు 700 ఏళ్ల నాటిది. ఈ ఆలయాన్ని ‘విడాకుల దేవాలయం’ అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని బౌద్ధ సన్యాసిని కకుసన్ తన భర్త హోజో టోకిమున్తో కలిసి నిర్మించారు. ఆ తర్వాత కకుసన్ స్వయంగా విడాకుల విషయంలో చిక్కుకుంది. అందుకే, భర్త నుంచి విడిపోయి మహిళలు శాంతియుతంగా జీవించే చోటు కల్పించాలని నిర్ణయించుకుంది.
Also Read: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో టీమిండియా
స్త్రీలు తమ భర్తలను విడిచిపెట్టే ముందు మూడు సంవత్సరాల పాటు ఈ ఆలయంలో ఉండవచ్చు. కాలక్రమేనా తర్వాత ఈ వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు. ఇక్కడ ఉండడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా స్వావలంబన పొందే అవకాశం కూడా లభించింది. చాలా ఏళ్లుగా ఈ ఆలయంలోకి కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉండేది. కానీ, 1902లో ఎంగాకు-జీ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, మగ మఠాధిపతిని నియమించారు. దాంతో పురుషులు కూడా ప్రవేశించడం ప్రారంభించారు.
తాజావార్తలు
-
Kamakshi: “సెక్స్ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
-
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!