Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News A Cup Of Tea That Cost 20 Years Man Story Goes Viral

Chennai: టీ తాగేందుకు దిగి.. 20 ఏళ్ల పాటు బందీగా

Published Date :March 16, 2025 , 1:41 pm
By Kothuru Ram Kumar
  • 20 ఏళ్ల పాటు బందీగా వ్యక్తి.
  • చెన్నైలో వెలుగుచూసిన ఉదంతం.
  • శివగంగై కలెక్టర్, మన్యం జిల్లా కలెక్టర్‌ల సహాయంతో విముక్తి.
  • కుమార్తె, అల్లుడిని పిలిపించి అప్పారావును అప్పచెపిన అధికారులు.
Chennai: టీ తాగేందుకు దిగి.. 20 ఏళ్ల పాటు బందీగా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chennai: కాలం ఎంత వేగంగా మారిపోయినా, కొందరి జీవితాల్లోని సంఘటనలు మాత్రం గుండెను కదిలించేలా ఉంటాయి. ఇలాంటి ఓ సంఘటన తాజాగా చెన్నైలో వెలుగుచూసింది. ఇరవై ఏళ్ల క్రితం తన కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తి, రెండు రాష్ట్రాల అధికారుల సహాయంతో తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. మన్యం జిల్లా పార్వతీపురం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అప్పారావు, కొన్నేళ్ల క్రితం తన స్నేహితులతో కలిసి నిర్మాణ పనుల నిమిత్తం పాండిచ్చేరి వెళ్ళే రైలులో ప్రయాణం సాగించాడు. మార్గమధ్యంలో చెన్నై రైల్వే స్టేషన్‌లో టీ తాగేందుకు రైలు నుంచి దిగిన అతను, తిరిగి తన రైలును చేరుకోలేకపోయాడు.

Read Also: SAMSUNG Galaxy M35 5G: సామ్ సంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 9 వేల డిస్కౌంట్.. ఫీచర్లు తెలిస్తే అస్సలు వదలరు

Also Read

  • Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
  • Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
  • Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు

తనతో పాటు వచ్చిన స్నేహితులను కోల్పోయిన అతను, ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో అప్పారావు రామేశ్వరం వెళ్ళే మరో రైలు ఎక్కాడు. అయితే, శివగంగై రైల్వే స్టేషన్ వద్ద దిగిన అతనికి అక్కడ కొత్త సమస్య ఎదురైంది. కలైయార్‌కో సమీపంలోని కడంపన్ గ్రామానికి చెందిన మలైకన్ను అనే వ్యక్తి, ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి, మేకలు మేపే పనిలోకి అతడిని తీసుకువెళ్లాడు. మూడేళ్ల పాటు మేకలను మేపుతూ జీవితం గడిపిన అప్పారావుకు, మలైకన్ను మరణించిన తర్వాత కూడా స్వేచ్ఛ దక్కలేదు. అదే గ్రామానికి చెందిన అన్నాదురై అనే వ్యక్తి, అతడిని బందీగా ఉంచి మళ్లీ మేకలు మేపే పనిలో నెట్టేశాడు. ఇరవై ఏళ్లుగా ఇంటికి తిరిగి వెళ్లే అవకాశాన్ని కోల్పోయిన ఆయన భాష రాకపోవడం, తెలియని ప్రదేశంలో ఉండటం వల్ల అక్కడే ఉండిపోయాడు.

Read Also: Court : కోర్ట్ తీర్పుకు కలెక్షన్స్ ప్రవాహం.. 2 రోజులకు ఎంతంటే..?

ఇటీవల శివగంగై జిల్లాలోని లేబర్ వెల్ఫేర్ అధికారులు సర్వే నిర్వహించే సందర్భంలో, అప్పారావు బందీ జీవితం బయటపడింది. వెంటనే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం శివగంగై కలెక్టర్, మన్యం జిల్లా కలెక్టర్‌ల సహాయంతో అప్పారావును ఇంటికి పంపే ఏర్పాట్లు చేశారు. భార్య సీతమ్మ చనిపోవడంతో అప్పారావు కుమార్తె తంబుదొర సాయమ్మ, అల్లుడిని పిలిపించి అప్పారావును కుటుంబంతో కలిపారు అధికారులు. అలా 20 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని తన తండ్రి గురించి ఎప్పుడూ ఆశలు వదిలేసిన అప్పారావు కుమార్తె తంబుదొర సాయమ్మ, తన తండ్రిని తిరిగి చూసిన క్షణం కంటతడి పెట్టుకుంది. తల్లి సీతమ్మ మరణించిన తర్వాత తన తండ్రిని కనీసం చివరి రోజులలో అయినా చూసుకోవాలని ఆకాంక్షించిన సాయమ్మ రెండు రాష్ట్రాల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chennai railway station
  • Heartwarming story
  • missing person
  • Reunited Family

తాజావార్తలు

  • Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..

  • Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక

  • IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!

  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..

  • MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions