Chennai: టీ తాగేందుకు దిగి.. 20 ఏళ్ల పాటు బందీగా
- 20 ఏళ్ల పాటు బందీగా వ్యక్తి.
- చెన్నైలో వెలుగుచూసిన ఉదంతం.
- శివగంగై కలెక్టర్, మన్యం జిల్లా కలెక్టర్ల సహాయంతో విముక్తి.
- కుమార్తె, అల్లుడిని పిలిపించి అప్పారావును అప్పచెపిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: కాలం ఎంత వేగంగా మారిపోయినా, కొందరి జీవితాల్లోని సంఘటనలు మాత్రం గుండెను కదిలించేలా ఉంటాయి. ఇలాంటి ఓ సంఘటన తాజాగా చెన్నైలో వెలుగుచూసింది. ఇరవై ఏళ్ల క్రితం తన కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తి, రెండు రాష్ట్రాల అధికారుల సహాయంతో తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. మన్యం జిల్లా పార్వతీపురం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అప్పారావు, కొన్నేళ్ల క్రితం తన స్నేహితులతో కలిసి నిర్మాణ పనుల నిమిత్తం పాండిచ్చేరి వెళ్ళే రైలులో ప్రయాణం సాగించాడు. మార్గమధ్యంలో చెన్నై రైల్వే స్టేషన్లో టీ తాగేందుకు రైలు నుంచి దిగిన అతను, తిరిగి తన రైలును చేరుకోలేకపోయాడు.
Also Read
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
తనతో పాటు వచ్చిన స్నేహితులను కోల్పోయిన అతను, ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో అప్పారావు రామేశ్వరం వెళ్ళే మరో రైలు ఎక్కాడు. అయితే, శివగంగై రైల్వే స్టేషన్ వద్ద దిగిన అతనికి అక్కడ కొత్త సమస్య ఎదురైంది. కలైయార్కో సమీపంలోని కడంపన్ గ్రామానికి చెందిన మలైకన్ను అనే వ్యక్తి, ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి, మేకలు మేపే పనిలోకి అతడిని తీసుకువెళ్లాడు. మూడేళ్ల పాటు మేకలను మేపుతూ జీవితం గడిపిన అప్పారావుకు, మలైకన్ను మరణించిన తర్వాత కూడా స్వేచ్ఛ దక్కలేదు. అదే గ్రామానికి చెందిన అన్నాదురై అనే వ్యక్తి, అతడిని బందీగా ఉంచి మళ్లీ మేకలు మేపే పనిలో నెట్టేశాడు. ఇరవై ఏళ్లుగా ఇంటికి తిరిగి వెళ్లే అవకాశాన్ని కోల్పోయిన ఆయన భాష రాకపోవడం, తెలియని ప్రదేశంలో ఉండటం వల్ల అక్కడే ఉండిపోయాడు.
Read Also: Court : కోర్ట్ తీర్పుకు కలెక్షన్స్ ప్రవాహం.. 2 రోజులకు ఎంతంటే..?
ఇటీవల శివగంగై జిల్లాలోని లేబర్ వెల్ఫేర్ అధికారులు సర్వే నిర్వహించే సందర్భంలో, అప్పారావు బందీ జీవితం బయటపడింది. వెంటనే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం శివగంగై కలెక్టర్, మన్యం జిల్లా కలెక్టర్ల సహాయంతో అప్పారావును ఇంటికి పంపే ఏర్పాట్లు చేశారు. భార్య సీతమ్మ చనిపోవడంతో అప్పారావు కుమార్తె తంబుదొర సాయమ్మ, అల్లుడిని పిలిపించి అప్పారావును కుటుంబంతో కలిపారు అధికారులు. అలా 20 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని తన తండ్రి గురించి ఎప్పుడూ ఆశలు వదిలేసిన అప్పారావు కుమార్తె తంబుదొర సాయమ్మ, తన తండ్రిని తిరిగి చూసిన క్షణం కంటతడి పెట్టుకుంది. తల్లి సీతమ్మ మరణించిన తర్వాత తన తండ్రిని కనీసం చివరి రోజులలో అయినా చూసుకోవాలని ఆకాంక్షించిన సాయమ్మ రెండు రాష్ట్రాల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!