The Indrani Mukerjea Story: Buried Truth : ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ ప్రేక్షకులు డాక్యుమెంటరీ సిరీస్లపై ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా సంచలన కేసుల ఆధారంగా రూపొందిన క్రైమ్ సిరీస్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్కు భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనమైన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా ఉండడంతో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతోంది.ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్ సిరీస్పై మొదటి నుంచే చాలా మందికి ఆసక్తి నెలకొంది. కోర్టులో కేసుల వల్ల ఆలస్యమైనా ఎట్టకేలకు ఈ సిరీస్ ఫిబ్రవరి 29వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. ప్రారంభం నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటోంది.. భారత్తో పాటు కెనడా, ఆస్ట్రేలియా సహా సుమారు 18 దేశాల్లో ఈ సిరీస్ ట్రెండ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్లో టాప్-7లో ఈ సిరీస్ నిలిచింది. వారంలోనే ఈ డాక్యు సిరీస్కు 2.2 మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. 6.9 మిలియన్ వాచ్ హవర్స్ ను దక్కించుకుంది. మొత్తంగా అంచనాలకు మించి ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ దుమ్మురేపుతోంది. షీనా బోరా హత్య కేసులో చాలా ట్విస్టులు ఉండడం, దాన్ని ఈ సిరీస్లో ఎఫెక్టివ్గా చూపించడంతో భారీ ఆదరణ దక్కించుకుంటోంది..
షీనా బోరా కేసు విచారణ దశలో ఉండటంతో ఈ సిరీస్ను ఆపాలని కోర్టుకు వెళ్లింది సీబీఐ. కింది కోర్టు నిరాకరించడంతో సీబీఐ బాంబే హైకోర్టుకు కూడా వెళ్లింది. ముందుగా సీబీఐ అధికారులకు స్క్రీనింగ్ తర్వాత.. ఈ సిరీస్ ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. వారం ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది.షీనా బోరా మర్డర్ కేసు దేశాన్ని కుదిపేసింది. 2012 ఏప్రిల్లో షీనా హత్యకు గురయ్యారు. అయితే, మూడేళ్ల తర్వాత 2015లో ఈ హత్య ఉదంతం బయటికి వచ్చింది. వేరే కేసులో పట్టుడిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ ఈ హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో షీనా హత్య వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియాను 2015లో అరెస్టు చేయడం సంచలనంగా మారింది.షీనా బోరా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది.
Also Read
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!