Biryani: రైలులో బిర్యానీ తిని ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biryani: రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు.. రకరకాల ఫుడ్ ఐటమ్స్ విక్రయిస్తుంటారు.. టీ, కాఫీ, బిస్కెట్లు, టిఫిన్లు, బిర్యానీ.. ఇలా ఒకరి తర్వాత ఒకరు రైళ్లలో ప్రయాణికులను ఉక్కొరిబిక్కిరి చేస్తుంటారు.. అలా పదే పదే వాళ్లు వస్తుండే సరికి.. కొందరు పిల్లల ఒత్తిడితో.. మరికొందరు ఆకలితో ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటారు.. మరికొందరు.. ఏదైనా స్టేషన్లో రైలు ఆగినప్పుడు.. అక్కడ దొరికే వాటిని కొనేస్తుటారు.. అయితే, అది అంత మంచిది కాదని మరో రెండు ఘటనలు రుజువు చేశాయి. అయితే, విశాఖ రైల్వేస్టేషన్ తో పాటు రైళ్లలో కొనుగోలు చేసిన బిర్యానీ తిని దాదాపు 10 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.
Read Also: Pallavi Prasanth : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఏం ఇప్పుడు చేస్తున్నాడో తెలుసా?
Also Read
- Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
- UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
- PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
- Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
రైళ్లలో అస్వస్థతకు గురైన ప్రయాణికులకును హుటాహుటిన రాజమహేంద్రవరంలోని జీజీహెచ్కు తరలించారు.. ఎవరికీ ప్రాణాపాయంలేకపోయినప్పటికీ.. తీవ్ర అస్వస్థత ఇబ్బంది పడుతున్నారు. ఇక, పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్నా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో సేలంకు వెళ్తున్న 15 మంది కార్మికులు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో బిర్యానీలు కొనుగులు చేశారట.. అయితే, ఆ బిర్యానీ తిన్న అరగంట తర్వాత వారిలో ఐదుగురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారని.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారడంతో రైలు మదద్ యాప్లో ఫిర్యాదు చేయడం.. సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్లో రైల్వే సిబ్బంది, పోలీసులు సిద్ధంగా ఉండి.. వారిని రాజమండ్రి జీజీహెచ్కి తరలించారు. మరోవైపు, దిబ్రూగఢ్-కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో కేరళలోని పాలక్కడ్కు వెళ్తున్న ఏడుగురు ప్రయాణికులు విశాఖ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రైలులో ఎగ్ బిర్యానీలు కొనుగోలు చేసి ఆరగించారు.. వారికి కూడా అదే పరిస్థితి ఎదురైంది.. వారిలో నలుగురిని రాజమండ్రి రైల్వేస్టేషన్లో దించి ఆస్పత్రికి తరలించారు.. ఇలా మొత్తంగా రైళ్లలో బిర్యానీ తిని ఒకే రోజు 9 మంది ఆస్పత్రిలో చేరారు. ప్రయాణాల్లో ఎక్కడపడితే అక్కడ ఆహారాన్ని కొనుగోలు చేసి.. లేని జబ్బులు తెచ్చుకోవద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
- Tags
- Andhra Pradesh
- biryani
- SICK
- Trains
తాజావార్తలు
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!