NTV Telugu Site icon

Suicide Bomb Blast: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 8 మంది సైనికులు దుర్మరణం

Suicide Bomb Blast

Suicide Bomb Blast

Suicide Bomb Blast: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో దాదాపు ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరణించగా.. మరో 17 మంది గాయపడ్డారు. ఈ మేరకు పాకిస్తాన్ టెలిగ్రాఫ్ గురువారం నివేదించింది. మాలి ఖేల్ ప్రాంతంలో భద్రతా దళాల కాన్వాయ్‌పై మోటర్‌బైక్‌పై వచ్చిన ఆత్మాహుతి బాంబర్ దాడి చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Also Read: Indian Economy: చైనా కన్నా ఎక్కువ.. తొలి త్రైమాసికంలో 7.8 వృద్ధి

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. జులై 30న ఒక రాజకీయ పార్టీ సమావేశంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడును ప్రేరేపించడంతో కనీసం 54 మంది మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. 400 మందికి పైగా JUI-F సభ్యులు, మద్దతుదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.