Mumbai: థానే కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థానేలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి.
ముంబై సమీపంలోని థానేలోని డోంబివాలిలో గురువారం మధ్యాహ్నం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో అనేక మంది కార్మికులు చిక్కుకుపోయారు. MIDC ఫేజ్ 2లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ భారీ పేలుడికి నలుగురు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఫ్యాక్టరీలో మూడు పేలుళ్లు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కనీసం ఎనిమిది మందిని రక్షించినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలిపారు.
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
డోంబివిలి ఎంఐడీసీలోని అముదన్ కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలిన ఘటన బాధాకరమని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు .ఈ ఘటనలో 8 మందిని రక్షించారని.. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మరిన్ని అంబులెన్స్లను సిద్ధంగా ఉంచామని.. దీనిపై కలెక్టర్తో చర్చిస్తున్నట్లు చెప్పారు. NDRF, TDRF. అగ్నిమాపక దళం 10 నిమిషాల్లోనే సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు దాదాపు 15 ఫైర్ ఇంజన్లు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇక మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. కార్ షోరూమ్ సహా మరో రెండు భవనాలకు మంటలు వ్యాపించాయి.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!