Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న డీఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good News: డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించనుంది. త్వరలో డీఏను మరోసారి 4 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఇప్పుడు అందుతున్న 38 శాతం డీఏకు అదనంగా మరో 4 శాతం చేరి..42 శాతం కానుంది. ప్రతి నెలా జారీ అయ్యే సీపీఐ సూచీ ప్రకారం అంటే వినియోగదారుల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు కరవుభత్యం పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ ఈ సూచీని విడుదల చేస్తుంటుంది. గత ఏడాది అంటే 2022 డిసెంబర్ నెల సూచీ ప్రకారం 4.3 శాతం డీఏ లెక్క వేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈసారి డీఏను 4 శాతం పెంచవచ్చని అంచనా ఉంది.
రాబడిని పరిగణనలో తీసుకుని డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్ధిక శాఖ..కేబినెట్ ఆమోదానికి పంపిస్తుంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు 38 శాతం డీఏ తీసుకుంటున్నారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో, ఉద్యోగుల డీఏ అలవెన్స్పై ఆమోద ముద్ర పడవచ్చు. దానితో పాటు పెరిగిన డీఏను కూడా ప్రకటించవచ్చు. అందువల్ల మార్చి నెల జీతంలో క్రమంగా పెరుగుదల ఉంటుంది. కేంద్ర ఉద్యోగుల జీతం రూ.27312 మేర పెరిగే అవకాశం ఉందని వర్గాల సమాచారం. మార్చి 1న మంత్రివర్గం సమావేశం కానుంది. డీఏకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత డియర్నెస్ అలవెన్స్లో భారీగా పెంపుదల ఉంటుంది. ఉద్యోగి ఖాతాలో పెద్ద మొత్తం జమ అవుతుంది. అలాగే ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు అందుతాయి. డీఏను 4 శాతం పెంచడం వల్ల ఉద్యోగుల జీతం నెలకు రూ.720 నుంచి రూ.2276కి భారీ ప్రయోజనం చేకూరుతుంది.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
Read Also: Anand Mahindra: కలిసి పనిచేద్దాం.. బిల్ గేట్స్తో ఆనంద్ మహీంద్రా
ఒక ఉద్యోగి మూల వేతనం రూ.18000 అయితే అతని జీతం నెలకు రూ.720 పెరుగుతుంది. ఉద్యోగి జీతం ఏడాదికి మొత్తం రూ.8640 పెరుగుతుంది. కాబట్టి ఒక ఉద్యోగి మూల వేతనం నెలకు రూ. 56900 అయితే, అతని జీతంలో నెలకు రూ. 2276 ప్రయోజనం పొందుతారు. ఉద్యోగి జీతం ఏడాదికి మొత్తం రూ.27312 పెరుగుతుంది.
Read Also: Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ @50.. బర్త్ డే గిఫ్ట్గా భారీ విగ్రహం
ఉద్యోగుల డీఏ 4 శాతం పెరిగితే అది ప్రస్తుతమున్న దానితో కలుపుకుంటే 42 శాతానికి చేరుతుంది. అయితే జూలై 2022లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచింది. డీఏ, డీఆర్ల పెంపుదల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా మారింది. ఇప్పటి వరకు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ పథకం ఖజానాకు గండి కొట్టడమేనన్నారు. కానీ ఇప్పుడు స్వరం కాస్త మెత్తబడింది. కొత్త పింఛను పథకంపై ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం ఈ కొత్త పథకంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త పెన్షన్ స్కీమ్ను సంస్కరించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కచ్చితమైన వార్తలు వచ్చాయి.
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!