Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న డీఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good News: డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించనుంది. త్వరలో డీఏను మరోసారి 4 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఇప్పుడు అందుతున్న 38 శాతం డీఏకు అదనంగా మరో 4 శాతం చేరి..42 శాతం కానుంది. ప్రతి నెలా జారీ అయ్యే సీపీఐ సూచీ ప్రకారం అంటే వినియోగదారుల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు కరవుభత్యం పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ ఈ సూచీని విడుదల చేస్తుంటుంది. గత ఏడాది అంటే 2022 డిసెంబర్ నెల సూచీ ప్రకారం 4.3 శాతం డీఏ లెక్క వేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈసారి డీఏను 4 శాతం పెంచవచ్చని అంచనా ఉంది.
రాబడిని పరిగణనలో తీసుకుని డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్ధిక శాఖ..కేబినెట్ ఆమోదానికి పంపిస్తుంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు 38 శాతం డీఏ తీసుకుంటున్నారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో, ఉద్యోగుల డీఏ అలవెన్స్పై ఆమోద ముద్ర పడవచ్చు. దానితో పాటు పెరిగిన డీఏను కూడా ప్రకటించవచ్చు. అందువల్ల మార్చి నెల జీతంలో క్రమంగా పెరుగుదల ఉంటుంది. కేంద్ర ఉద్యోగుల జీతం రూ.27312 మేర పెరిగే అవకాశం ఉందని వర్గాల సమాచారం. మార్చి 1న మంత్రివర్గం సమావేశం కానుంది. డీఏకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత డియర్నెస్ అలవెన్స్లో భారీగా పెంపుదల ఉంటుంది. ఉద్యోగి ఖాతాలో పెద్ద మొత్తం జమ అవుతుంది. అలాగే ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు అందుతాయి. డీఏను 4 శాతం పెంచడం వల్ల ఉద్యోగుల జీతం నెలకు రూ.720 నుంచి రూ.2276కి భారీ ప్రయోజనం చేకూరుతుంది.
Also Read
Read Also: Anand Mahindra: కలిసి పనిచేద్దాం.. బిల్ గేట్స్తో ఆనంద్ మహీంద్రా
ఒక ఉద్యోగి మూల వేతనం రూ.18000 అయితే అతని జీతం నెలకు రూ.720 పెరుగుతుంది. ఉద్యోగి జీతం ఏడాదికి మొత్తం రూ.8640 పెరుగుతుంది. కాబట్టి ఒక ఉద్యోగి మూల వేతనం నెలకు రూ. 56900 అయితే, అతని జీతంలో నెలకు రూ. 2276 ప్రయోజనం పొందుతారు. ఉద్యోగి జీతం ఏడాదికి మొత్తం రూ.27312 పెరుగుతుంది.
Read Also: Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ @50.. బర్త్ డే గిఫ్ట్గా భారీ విగ్రహం
ఉద్యోగుల డీఏ 4 శాతం పెరిగితే అది ప్రస్తుతమున్న దానితో కలుపుకుంటే 42 శాతానికి చేరుతుంది. అయితే జూలై 2022లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచింది. డీఏ, డీఆర్ల పెంపుదల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా మారింది. ఇప్పటి వరకు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ పథకం ఖజానాకు గండి కొట్టడమేనన్నారు. కానీ ఇప్పుడు స్వరం కాస్త మెత్తబడింది. కొత్త పింఛను పథకంపై ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం ఈ కొత్త పథకంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త పెన్షన్ స్కీమ్ను సంస్కరించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కచ్చితమైన వార్తలు వచ్చాయి.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!