Food Poision: మహారాష్ట్రలో ఫుడ్ పాయిజన్.. ప్రాణాపాయ స్థితిలో 61మంది చిన్నారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Poision: మహారాష్ట్రలో విషాదం నెలకొంది. రాజ్గురునగర్ లోని హుతాత్మ రాజగురు విద్యాలయంలో మధ్యాహ్న భోజనం తిన్న 61 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. గురువారం మధ్యాహ్నం విరామ సమయంలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పాఠశాలలోని కొంతమంది విద్యార్థులకు వికారం, కడుపునొప్పి రావడంతో ప్రిన్సిపాల్ అశోక్ నాగర్కర్ పిల్లలను సమీపంలోని చందోలి గ్రామీణ ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ విక్రాంత్ చవాన్, తహసీల్దార్ డాక్టర్ వైశాలి వాగ్మారే, పోలీస్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ కేంద్ర, గ్రూప్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జీవన్ కొకనే తదితరులు విద్యార్థులకు చికిత్స అందించేందుకు తక్షణమే ప్రయత్నాలు చేశారు. మహేంద్ర గార్డ్ అతడి బృందం ఆధ్వర్యంలో 24 గంటల పాటు విద్యార్థులను ఆసుపత్రిలోనే ఉంచుతామని ఆసుపత్రి వైద్యాధికారి తెలిపారు.
Read Also: Itching Powder: మంత్రిపై దురద పౌడర్తో దాడి.. నిలిచిపోయిన రథయాత్ర, వీడియో వైరల్
Also Read
- Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
హుతాత్మ రాజ్గురు విద్యాలయంలో 296 మంది విద్యార్థులు 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్నారు. 61 మంది విద్యార్థులకు ప్రాథమికంగా విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రుల్లో భయానక వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన విరామం ఇచ్చారు. ఎప్పటిలాగే విద్యార్థులు అన్నం తిన్నారు. చాలా మంది విద్యార్థులు భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో సబ్బు వాసన వచ్చిందని చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఆహారం తగ్గించారు. ఒకటిన్నర గంటలకు పాఠశాల ప్రారంభమైంది. రెండున్నర గంటల సమయంలో తరగతి గదిలో కూర్చున్న చాలా మంది పిల్లలకు కడుపునొప్పి, వికారంగా అంటూ కిందపడిపోయారు. వెంటనే గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులను చందోలి ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థుల చేరికతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. పౌష్టికాహారం తయారు చేసిన వారిపై కేసు పెట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!