Food Poision: మహారాష్ట్రలో ఫుడ్ పాయిజన్.. ప్రాణాపాయ స్థితిలో 61మంది చిన్నారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Poision: మహారాష్ట్రలో విషాదం నెలకొంది. రాజ్గురునగర్ లోని హుతాత్మ రాజగురు విద్యాలయంలో మధ్యాహ్న భోజనం తిన్న 61 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. గురువారం మధ్యాహ్నం విరామ సమయంలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పాఠశాలలోని కొంతమంది విద్యార్థులకు వికారం, కడుపునొప్పి రావడంతో ప్రిన్సిపాల్ అశోక్ నాగర్కర్ పిల్లలను సమీపంలోని చందోలి గ్రామీణ ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ విక్రాంత్ చవాన్, తహసీల్దార్ డాక్టర్ వైశాలి వాగ్మారే, పోలీస్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ కేంద్ర, గ్రూప్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జీవన్ కొకనే తదితరులు విద్యార్థులకు చికిత్స అందించేందుకు తక్షణమే ప్రయత్నాలు చేశారు. మహేంద్ర గార్డ్ అతడి బృందం ఆధ్వర్యంలో 24 గంటల పాటు విద్యార్థులను ఆసుపత్రిలోనే ఉంచుతామని ఆసుపత్రి వైద్యాధికారి తెలిపారు.
Read Also: Itching Powder: మంత్రిపై దురద పౌడర్తో దాడి.. నిలిచిపోయిన రథయాత్ర, వీడియో వైరల్
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
హుతాత్మ రాజ్గురు విద్యాలయంలో 296 మంది విద్యార్థులు 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్నారు. 61 మంది విద్యార్థులకు ప్రాథమికంగా విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రుల్లో భయానక వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన విరామం ఇచ్చారు. ఎప్పటిలాగే విద్యార్థులు అన్నం తిన్నారు. చాలా మంది విద్యార్థులు భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో సబ్బు వాసన వచ్చిందని చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఆహారం తగ్గించారు. ఒకటిన్నర గంటలకు పాఠశాల ప్రారంభమైంది. రెండున్నర గంటల సమయంలో తరగతి గదిలో కూర్చున్న చాలా మంది పిల్లలకు కడుపునొప్పి, వికారంగా అంటూ కిందపడిపోయారు. వెంటనే గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులను చందోలి ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థుల చేరికతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. పౌష్టికాహారం తయారు చేసిన వారిపై కేసు పెట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..