Food Poision: మహారాష్ట్రలో ఫుడ్ పాయిజన్.. ప్రాణాపాయ స్థితిలో 61మంది చిన్నారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Poision: మహారాష్ట్రలో విషాదం నెలకొంది. రాజ్గురునగర్ లోని హుతాత్మ రాజగురు విద్యాలయంలో మధ్యాహ్న భోజనం తిన్న 61 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. గురువారం మధ్యాహ్నం విరామ సమయంలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పాఠశాలలోని కొంతమంది విద్యార్థులకు వికారం, కడుపునొప్పి రావడంతో ప్రిన్సిపాల్ అశోక్ నాగర్కర్ పిల్లలను సమీపంలోని చందోలి గ్రామీణ ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ విక్రాంత్ చవాన్, తహసీల్దార్ డాక్టర్ వైశాలి వాగ్మారే, పోలీస్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్ కేంద్ర, గ్రూప్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జీవన్ కొకనే తదితరులు విద్యార్థులకు చికిత్స అందించేందుకు తక్షణమే ప్రయత్నాలు చేశారు. మహేంద్ర గార్డ్ అతడి బృందం ఆధ్వర్యంలో 24 గంటల పాటు విద్యార్థులను ఆసుపత్రిలోనే ఉంచుతామని ఆసుపత్రి వైద్యాధికారి తెలిపారు.
Read Also: Itching Powder: మంత్రిపై దురద పౌడర్తో దాడి.. నిలిచిపోయిన రథయాత్ర, వీడియో వైరల్
Also Read
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
హుతాత్మ రాజ్గురు విద్యాలయంలో 296 మంది విద్యార్థులు 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్నారు. 61 మంది విద్యార్థులకు ప్రాథమికంగా విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రుల్లో భయానక వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన విరామం ఇచ్చారు. ఎప్పటిలాగే విద్యార్థులు అన్నం తిన్నారు. చాలా మంది విద్యార్థులు భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో సబ్బు వాసన వచ్చిందని చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఆహారం తగ్గించారు. ఒకటిన్నర గంటలకు పాఠశాల ప్రారంభమైంది. రెండున్నర గంటల సమయంలో తరగతి గదిలో కూర్చున్న చాలా మంది పిల్లలకు కడుపునొప్పి, వికారంగా అంటూ కిందపడిపోయారు. వెంటనే గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులను చందోలి ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థుల చేరికతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. పౌష్టికాహారం తయారు చేసిన వారిపై కేసు పెట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!