AAP Corporators: సూరత్లో ఆప్కు షాక్.. అధికార బీజేపీలో చేరిన ఆరుగురు కార్పొరేటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP Corporators Join in BJP: ఇటీవలే జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్లో ఎదురుదెబ్బ తగిలింది. 2021లో జరిగిన సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 27 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు అక్కడ ఆ పార్టీకి షాక్ తగిలింది. ఆరుగురు ఆప్ కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్బై చెప్పి అధికార బీజేపీలో చేరారు. గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీల సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు.
2021లో జరిగిన సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఏకంగా 27 స్థానాలను గెలుచుకుని ఔరా అనిపించింది. ఈ విజయంతో గుజరాత్లో ప్రతిపక్ష హోదాను పొందగలిగింది. ఐదుగురు ఆప్ కార్పొరేటర్లు ఫిబ్రవరి 2022లో బీజేపీలో చేరారు. అయితే వారిలో ఒకరు తిరిగి ఆప్లోకి వచ్చారు. ఇప్పుడు మరో ఆరుగురు కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఆప్ బలం 17కి పడిపోయింది. మొత్తం 120 సీట్లలో బీజేపీ 93 స్థానాల్లో గెలుపొందింది. ఆప్ నుంచి 10 మంది చేరడంతో బీజేపీ బలం 103కి చేరుకుంది.
Also Read
Read Also: Karnataka: బీజేపీలో అంతర్గత కలహాలు.. జగదీష్ షెట్టర్ నిర్ణయంపై ఉత్కంఠ
వారి స్వాగత కార్యక్రమంలో హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ.. ఆప్ కార్పొరేటర్లు తమ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారని ఆయన తెలిపారు. ఆప్ అసలు ముఖం నేడు దేశం ముందు వెలుగులోకి వస్తోందన్నారు. ఈ ఆరుగురు కార్పొరేటర్లలో ఒకరైన రూటా ఖేని మాట్లాడుతూ.. కాషాయ పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్రమోదీ వ్యవహారశైలితో ప్రభావితమై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, తమ కార్పొరేటర్లను ప్రలోభపెట్టడంతోపాటు బీజేపీలో చేరమని బెదిరిస్తున్నారని ఆప్ రాష్ట్ర విభాగం ఆరోపించింది
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!