Chardham Yatra 2024: చార్ధామ్ యాత్ర.. 6 నెలల్లో 53 మంది భక్తులు మృతి
- ముగిసిన చార్ధామ్ యాత్ర
- మూతపడిన గంగోత్రి ధామ్
- నేడు కేదార్నాథ్ ధామ్ ఆలయం మూసివేత
- ఆదివారం మూత పడిన యమునోత్రి ధామ్
- మే 10న ప్రారంభమైన చార్ధామ్ యాత్ర
- ఇప్పటి వరకు 53 మంది భక్తులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర 2024 నవంబర్ నెలలో చివరికి చేరుకుంది. నవంబర్ 2న గంగోత్రి ధామ్ తలుపులు మూసేయగా.. నవంబర్ 3న కేదార్నాథ్ ధామ్ ఆలయాన్ని కూడా క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు కూడా చట్ట ప్రకారం మూసివేశారు. మే 10న ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఈ ఏడాది గంగోత్రి, యమునోత్రి ధామ్లకు వచ్చిన భక్తులలో ఇప్పటివరకు 53 మంది మరణించారు. ఇందులో యమునోత్రి ధామ్లో 40 మంది, గంగోత్రి ధామ్లో 13 మంది యాత్రికులు ఉన్నారు. పర్వతారోహణ కష్టతరంగా ఉండడంతో పాటు వాతావరణంలో మార్పు కూడా భక్తుల మరణాలకు ప్రధాన కారణంగా మారుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా అనారోగ్యంతో ఉన్న భక్తులు, వృద్ధులు తమ పూర్తి ఆరోగ్య పరీక్షల తర్వాతే చార్ధామ్ యాత్రకు వెళ్లాలని వైద్యులు చెబుతున్నారు.
గతేడాది 63 మంది మరణం..
చార్ధామ్ యాత్ర మార్గంలో 3 కన్వారియాలు తప్పిపోయారు. ఇంకా వారి జడ దొరకలేదు. గతేడాది 2023లో యమునోత్రి ధామ్లో 62 మంది చనిపోయారు. ఈ యాత్రలో యమునోత్రిలో 41 మంది, గంగోత్రిలో 21 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరు నెలల ప్రయాణ కాలంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాత్రికులు ఈ రెండు ప్రదేశాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వచ్చారు. ఇప్పటి వరకు 15,21,752 మంది యాత్రికులు రెండు ధామ్లను సందర్శించారు. వీరిలో 7,10,210 మంది యాత్రికులు యమునోత్రి ధామ్ను సందర్శించగా.. 8,11,542 మంది యాత్రికులు గంగోత్రి ధామ్ను సందర్శించారు. మే 10న అక్షయ తృతీయ పర్వదినాన గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరవడంతో ప్రారంభమైన చార్ధామ్ యాత్ర ప్రస్తుతం ముగిసింది. ఈ సంవత్సరం, గంగోత్రి ధామ్ 177 రోజులు, యమునోత్రి ధామ్ యత్ర 178 రోజులు సాగింది.
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్..
శీతాకాలం కోసం బద్రీనాథ్ ధామ్ తలుపులు నవంబర్ 17న రాత్రి 9.07 గంటలకు మూసివేయబడతాయి. భక్తులు త్వరగా స్వామిని దర్శించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు.. ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు బద్రీనాథ్ ధామ్కు చేరుకుంటున్నారు. శనివారం కూడా 6500 మందికి పైగా భక్తులు బద్రీనాథ్ చేరుకున్నారు. ఇప్పటి వరకు12 లక్షల 74 వేల మంది యాత్రికులు బద్రీనాథ్ స్వామివారిని దర్శించుకున్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్