Chardham Yatra 2024: చార్ధామ్ యాత్ర.. 6 నెలల్లో 53 మంది భక్తులు మృతి
- ముగిసిన చార్ధామ్ యాత్ర
- మూతపడిన గంగోత్రి ధామ్
- నేడు కేదార్నాథ్ ధామ్ ఆలయం మూసివేత
- ఆదివారం మూత పడిన యమునోత్రి ధామ్
- మే 10న ప్రారంభమైన చార్ధామ్ యాత్ర
- ఇప్పటి వరకు 53 మంది భక్తులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర 2024 నవంబర్ నెలలో చివరికి చేరుకుంది. నవంబర్ 2న గంగోత్రి ధామ్ తలుపులు మూసేయగా.. నవంబర్ 3న కేదార్నాథ్ ధామ్ ఆలయాన్ని కూడా క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు కూడా చట్ట ప్రకారం మూసివేశారు. మే 10న ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఈ ఏడాది గంగోత్రి, యమునోత్రి ధామ్లకు వచ్చిన భక్తులలో ఇప్పటివరకు 53 మంది మరణించారు. ఇందులో యమునోత్రి ధామ్లో 40 మంది, గంగోత్రి ధామ్లో 13 మంది యాత్రికులు ఉన్నారు. పర్వతారోహణ కష్టతరంగా ఉండడంతో పాటు వాతావరణంలో మార్పు కూడా భక్తుల మరణాలకు ప్రధాన కారణంగా మారుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా అనారోగ్యంతో ఉన్న భక్తులు, వృద్ధులు తమ పూర్తి ఆరోగ్య పరీక్షల తర్వాతే చార్ధామ్ యాత్రకు వెళ్లాలని వైద్యులు చెబుతున్నారు.
గతేడాది 63 మంది మరణం..
చార్ధామ్ యాత్ర మార్గంలో 3 కన్వారియాలు తప్పిపోయారు. ఇంకా వారి జడ దొరకలేదు. గతేడాది 2023లో యమునోత్రి ధామ్లో 62 మంది చనిపోయారు. ఈ యాత్రలో యమునోత్రిలో 41 మంది, గంగోత్రిలో 21 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరు నెలల ప్రయాణ కాలంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాత్రికులు ఈ రెండు ప్రదేశాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వచ్చారు. ఇప్పటి వరకు 15,21,752 మంది యాత్రికులు రెండు ధామ్లను సందర్శించారు. వీరిలో 7,10,210 మంది యాత్రికులు యమునోత్రి ధామ్ను సందర్శించగా.. 8,11,542 మంది యాత్రికులు గంగోత్రి ధామ్ను సందర్శించారు. మే 10న అక్షయ తృతీయ పర్వదినాన గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరవడంతో ప్రారంభమైన చార్ధామ్ యాత్ర ప్రస్తుతం ముగిసింది. ఈ సంవత్సరం, గంగోత్రి ధామ్ 177 రోజులు, యమునోత్రి ధామ్ యత్ర 178 రోజులు సాగింది.
Also Read
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్..
శీతాకాలం కోసం బద్రీనాథ్ ధామ్ తలుపులు నవంబర్ 17న రాత్రి 9.07 గంటలకు మూసివేయబడతాయి. భక్తులు త్వరగా స్వామిని దర్శించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు.. ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు బద్రీనాథ్ ధామ్కు చేరుకుంటున్నారు. శనివారం కూడా 6500 మందికి పైగా భక్తులు బద్రీనాథ్ చేరుకున్నారు. ఇప్పటి వరకు12 లక్షల 74 వేల మంది యాత్రికులు బద్రీనాథ్ స్వామివారిని దర్శించుకున్నారు.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!