Chardham Yatra 2024: చార్ధామ్ యాత్ర.. 6 నెలల్లో 53 మంది భక్తులు మృతి
- ముగిసిన చార్ధామ్ యాత్ర
- మూతపడిన గంగోత్రి ధామ్
- నేడు కేదార్నాథ్ ధామ్ ఆలయం మూసివేత
- ఆదివారం మూత పడిన యమునోత్రి ధామ్
- మే 10న ప్రారంభమైన చార్ధామ్ యాత్ర
- ఇప్పటి వరకు 53 మంది భక్తులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర 2024 నవంబర్ నెలలో చివరికి చేరుకుంది. నవంబర్ 2న గంగోత్రి ధామ్ తలుపులు మూసేయగా.. నవంబర్ 3న కేదార్నాథ్ ధామ్ ఆలయాన్ని కూడా క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు కూడా చట్ట ప్రకారం మూసివేశారు. మే 10న ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఈ ఏడాది గంగోత్రి, యమునోత్రి ధామ్లకు వచ్చిన భక్తులలో ఇప్పటివరకు 53 మంది మరణించారు. ఇందులో యమునోత్రి ధామ్లో 40 మంది, గంగోత్రి ధామ్లో 13 మంది యాత్రికులు ఉన్నారు. పర్వతారోహణ కష్టతరంగా ఉండడంతో పాటు వాతావరణంలో మార్పు కూడా భక్తుల మరణాలకు ప్రధాన కారణంగా మారుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా అనారోగ్యంతో ఉన్న భక్తులు, వృద్ధులు తమ పూర్తి ఆరోగ్య పరీక్షల తర్వాతే చార్ధామ్ యాత్రకు వెళ్లాలని వైద్యులు చెబుతున్నారు.
గతేడాది 63 మంది మరణం..
చార్ధామ్ యాత్ర మార్గంలో 3 కన్వారియాలు తప్పిపోయారు. ఇంకా వారి జడ దొరకలేదు. గతేడాది 2023లో యమునోత్రి ధామ్లో 62 మంది చనిపోయారు. ఈ యాత్రలో యమునోత్రిలో 41 మంది, గంగోత్రిలో 21 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరు నెలల ప్రయాణ కాలంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాత్రికులు ఈ రెండు ప్రదేశాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వచ్చారు. ఇప్పటి వరకు 15,21,752 మంది యాత్రికులు రెండు ధామ్లను సందర్శించారు. వీరిలో 7,10,210 మంది యాత్రికులు యమునోత్రి ధామ్ను సందర్శించగా.. 8,11,542 మంది యాత్రికులు గంగోత్రి ధామ్ను సందర్శించారు. మే 10న అక్షయ తృతీయ పర్వదినాన గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరవడంతో ప్రారంభమైన చార్ధామ్ యాత్ర ప్రస్తుతం ముగిసింది. ఈ సంవత్సరం, గంగోత్రి ధామ్ 177 రోజులు, యమునోత్రి ధామ్ యత్ర 178 రోజులు సాగింది.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్..
శీతాకాలం కోసం బద్రీనాథ్ ధామ్ తలుపులు నవంబర్ 17న రాత్రి 9.07 గంటలకు మూసివేయబడతాయి. భక్తులు త్వరగా స్వామిని దర్శించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు.. ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు బద్రీనాథ్ ధామ్కు చేరుకుంటున్నారు. శనివారం కూడా 6500 మందికి పైగా భక్తులు బద్రీనాథ్ చేరుకున్నారు. ఇప్పటి వరకు12 లక్షల 74 వేల మంది యాత్రికులు బద్రీనాథ్ స్వామివారిని దర్శించుకున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!