Chardham Yatra 2024: చార్ధామ్ యాత్ర.. 6 నెలల్లో 53 మంది భక్తులు మృతి
- ముగిసిన చార్ధామ్ యాత్ర
- మూతపడిన గంగోత్రి ధామ్
- నేడు కేదార్నాథ్ ధామ్ ఆలయం మూసివేత
- ఆదివారం మూత పడిన యమునోత్రి ధామ్
- మే 10న ప్రారంభమైన చార్ధామ్ యాత్ర
- ఇప్పటి వరకు 53 మంది భక్తులు మృతి
ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర 2024 నవంబర్ నెలలో చివరికి చేరుకుంది. నవంబర్ 2న గంగోత్రి ధామ్ తలుపులు మూసేయగా.. నవంబర్ 3న కేదార్నాథ్ ధామ్ ఆలయాన్ని కూడా క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు కూడా చట్ట ప్రకారం మూసివేశారు. మే 10న ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఈ ఏడాది గంగోత్రి, యమునోత్రి ధామ్లకు వచ్చిన భక్తులలో ఇప్పటివరకు 53 మంది మరణించారు. ఇందులో యమునోత్రి ధామ్లో 40 మంది, గంగోత్రి ధామ్లో 13 మంది యాత్రికులు ఉన్నారు. పర్వతారోహణ కష్టతరంగా ఉండడంతో పాటు వాతావరణంలో మార్పు కూడా భక్తుల మరణాలకు ప్రధాన కారణంగా మారుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా అనారోగ్యంతో ఉన్న భక్తులు, వృద్ధులు తమ పూర్తి ఆరోగ్య పరీక్షల తర్వాతే చార్ధామ్ యాత్రకు వెళ్లాలని వైద్యులు చెబుతున్నారు.
గతేడాది 63 మంది మరణం..
చార్ధామ్ యాత్ర మార్గంలో 3 కన్వారియాలు తప్పిపోయారు. ఇంకా వారి జడ దొరకలేదు. గతేడాది 2023లో యమునోత్రి ధామ్లో 62 మంది చనిపోయారు. ఈ యాత్రలో యమునోత్రిలో 41 మంది, గంగోత్రిలో 21 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరు నెలల ప్రయాణ కాలంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాత్రికులు ఈ రెండు ప్రదేశాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వచ్చారు. ఇప్పటి వరకు 15,21,752 మంది యాత్రికులు రెండు ధామ్లను సందర్శించారు. వీరిలో 7,10,210 మంది యాత్రికులు యమునోత్రి ధామ్ను సందర్శించగా.. 8,11,542 మంది యాత్రికులు గంగోత్రి ధామ్ను సందర్శించారు. మే 10న అక్షయ తృతీయ పర్వదినాన గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరవడంతో ప్రారంభమైన చార్ధామ్ యాత్ర ప్రస్తుతం ముగిసింది. ఈ సంవత్సరం, గంగోత్రి ధామ్ 177 రోజులు, యమునోత్రి ధామ్ యత్ర 178 రోజులు సాగింది.
Also Read
- Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్..
శీతాకాలం కోసం బద్రీనాథ్ ధామ్ తలుపులు నవంబర్ 17న రాత్రి 9.07 గంటలకు మూసివేయబడతాయి. భక్తులు త్వరగా స్వామిని దర్శించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు.. ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు బద్రీనాథ్ ధామ్కు చేరుకుంటున్నారు. శనివారం కూడా 6500 మందికి పైగా భక్తులు బద్రీనాథ్ చేరుకున్నారు. ఇప్పటి వరకు12 లక్షల 74 వేల మంది యాత్రికులు బద్రీనాథ్ స్వామివారిని దర్శించుకున్నారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో