Kanwar Yatra: కన్వర్ యాత్రలో విషాదం.. ట్రక్కు ఢీకొని 6గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanwar Yatra: పవిత్ర కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. శివభక్తులు గ్వాలియర్ నుంచి యూపీలోని హరిద్వార్ మీదుగా తమ సొంత జిల్లాకు వెళ్తుండగా.. హత్రాస్లోని సదాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో కన్వర్ యాత్రకు వెళ్లిన ఏడుగురు భక్తులను ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. గ్వాలియర్ నుండి భక్తులు హరిద్వార్ నుండి తమ సొంత జిల్లాకు వెళుతుండగా, వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లిందని ఆగ్రా జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కృష్ణ తెలిపారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, ట్రక్ డ్రైవర్ గురించి తమకు సమాచారం అందిందని రాజీవ్ కృష్ణ చెప్పారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. హిందువుల పవిత్ర మాసం శ్రావణంలో గంగా నది నీటిని తీసుకొచ్చి దేవుడికి సమర్పించేందుకు శివుని భక్తులు ఉత్తరాఖండ్లోని హరిద్వార్, రిషికేశ్, గౌముఖ్, ఇతర ప్రదేశాలకు కాలినడకన కన్వర్ యాత్ర సాగిస్తారు.ఈ వారం ప్రారంభంలో హరిద్వార్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది ప్రవాహానికి ఏడుగురు భక్తులు కొట్టుకుపోయారు. కన్వర్ యాత్ర.. ఇది హరిద్వార్, గౌముఖ్, ఇతర ప్రాంతాలలో ఏటా నిర్వహించబడే ఒక యాత్ర. గత రెండేళ్లలో ఇది కరోనా మహమ్మారి కారణంగా జరగలేదు.
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Labours stuck in Flood: వాగులో చిక్కుకున్న 23 మంది కూలీలు సేఫ్.. ఒడ్డుకు చేర్చిన సహాయక బృందాలు
ఇదిలా ఉండగా శ్రావణంలో జరుగుతున్న కన్వర్ యాత్ర కారణంగా జులై 25, 26 తేదీల్లో హరిద్వార్, మీరట్, మొరాదాబాద్లలోని విద్యాసంస్థలు మూసివేయబడతాయి. జులై 25, 26వ తేదీల్లో రెండు రోజులు విద్యాసంస్థలు తెరుచుకోబోవని, భక్తులు ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేందుకు వీధుల్లో ఉంటారని, ట్రాఫిక్ జామ్లను నివారించేందుకు పాఠశాలలను మూసివేయాలని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!