Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 5 Districts Of Jharkhand Have More Aadhaar Cards Than Population

Fake Aadhaar: ఈ 5 జిల్లాల్లో ప్రజల సంఖ్య కంటే.. ఆధార్ కార్డులే ఎక్కువ!

Published Date :December 23, 2024 , 6:24 pm
By RAMAKRISHNA KENCHE
  • జార్ఖండ్‌లో ఆగని బంగ్లాదేశ్ చొరబాట్లు
  • గతంలో బయటపడ్డ ఓటరు కార్డుల వ్యవహారం
  • తాజాగా ఆధార్ కార్డుల వ్యవహారంపై గందరగోళం
  • జనాభా సంఖ్య కంటే ఆధార్ కార్డులే ఎక్కువ
Fake Aadhaar:  ఈ 5 జిల్లాల్లో ప్రజల సంఖ్య కంటే.. ఆధార్ కార్డులే ఎక్కువ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

జార్ఖండ్‌లో బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. జనాభా కంటే ఎక్కువ ఓటరు కార్డుల వ్యవహారం అసెంబ్లీ ఎన్నికల్లో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అధికార జేఎంఎంపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో గెలవడానికి బంగ్లాదేశీయుల పేరుతో నకిలీ ఓట్లు వేయించారని బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు జనాభా కంటే ఎక్కువ ఆధార్ కార్డులే ఎక్కువగా ఉన్నాయన్న వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ఈ విషయంలో అధికార జేఎంఎం దేశ హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఫ్రంట్ తెరిచింది.

ఓటర్ల సంఖ్య కంటే కార్డులే ఎక్కువ?
కాగా.. సంతాల్ పరగణా సహా జార్ఖండ్ సరిహద్దు జిల్లాల్లో బంగ్లాదేశ్ చొరబాట్ల సమస్య కొత్తేం కాదు. ఇదే కేసు విచారణ ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. తాజాగా రాష్ట్రంలోని 5 జిల్లాల్లో జనాభా కంటే ఎక్కువ ఆధార్ కార్డులు తయారయ్యాయని బట్టబయలైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జనాభా కంటే ఎక్కువ ఓటరు కార్డులు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చాలా ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 130 శాతానికి పైగా ఉన్నట్లు తేలింది.

Also Read

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

జానాభా ఎంత.. ఆధార్ కార్డులు ఎన్ని?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఓటర్ల సంఖ్య అకస్మాత్తుగా పెరగడాన్ని బీజేపీ సమస్యగా మార్చడానికి ప్రయత్నించింది. ఎన్నికల్లో గెలవడానికి బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓటర్ కార్డులు తయారు చేశారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి లోహర్దగా జిల్లా మొత్తం జనాభా 5,58,849. ఇక్కడ 6,08,111 ఆధార్ కార్డులున్నాయి. సాహిబ్‌గంజ్ జిల్లాలో 104.40 శాతం ఓటరు కార్డులు తయారు చేశారు. ఇక్కడ మొత్తం జనాభా 13,92,393.. అయితే 14,53,634 కార్డులున్నాయి. పాకూర్ జిల్లాలో కూడా 10,89,673 మందికి గానూ 11,36,959 ఆధార్లు రూపొందించారు. లతేహర్ జిల్లాలో 8,79,774 జనాభాకు ఉండగా.. 9,04,150 ఆధార్ కార్డులు ఉన్నట్లు తేలింది. గర్వా జిల్లాలో 16,00,807 మంది జనాభాకు గాను 16,20,376 ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.

హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్..
మరోవైపు జార్ఖండ్‌లో కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జ్ రాకేష్ సిన్హా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. ఈ ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తయారు చేసిందని ఆరోపించారు. ఇది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం, దేశ హోంమంత్రి వైఫల్యమని విమర్శించారు. బీజేపీ నేతలకు కాస్త నైతికత ఉంటే దేశ హోంమంత్రిని సూటిగా ప్రశ్నించాలన్నారు. దేశ హోంమంత్రి సరిహద్దును సరిగ్గా నిర్వర్తించడం లేదని.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5 districts of Jharkhand
  • Aadhaar cards
  • Banglades
  • Bangladeshi intrusions
  • Fake Aadhaar

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions