Iran Protests: ఇరాన్ నిరసనల అణిచివేతలో 47 మంది పిల్లలతో సహా 378 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Protests: ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలపై ఉక్కుపాదం మోపింది. దాడులు, అరెస్టులు, హత్యలతో ఇరాన్ దేశం మొత్తాన్ని ఓ యుద్ద క్షేత్రంలా మార్చింది. సెప్టెంబరులో మహ్సా అమిని అనే యువతి హిజాబ్ సరిగా వేసుకోలేదనే కారణంతో పోలీసులు కొట్టి చంపిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ముఖ్యంగా స్త్రీలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. వారికి మద్దతుగా పురుషులు కూడా రోడ్లెక్కుతున్నారు. పాఠశాల విద్యార్థులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహంతో తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హింసకు తెరలేపింది. నిరసనకారులపై దాడులు, అరెస్టులు, హత్యలతో ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తోంది. అయినా ఉద్యమం ఆగకపోగా దేశవ్యాప్తంగా విస్తరించింది.
మహ్సా అమినీ మరణంతో చెలరేగిన నిరసనలపై అణిచివేతలో ఇరాన్ భద్రతా దళాలు కనీసం 47 మంది పిల్లలతో సహా 378 మందిని హతమార్చాయని ఇరాన్ మానవ హక్కుల సంఘం శనివారం వెల్లడించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంలో మహిళల కోసం కఠినమైన దుస్తుల నియమావళిని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసిన మూడు రోజుల తర్వాత, సెప్టెంబర్ 16న అమిని మరణంపై చెలరేగిన నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనలు మహిళల దుస్తుల నిబంధనలపై ఆగ్రహంతో ఊపందుకున్నాయి, కానీ 1979 విప్లవం నుండి ఇరాన్ను పాలించిన దైవపరిపాలనకు వ్యతిరేకంగా విస్తృత ఉద్యమంగా ఎదిగింది. సెప్టెంబర్ 16 నుంచి 47 మంది పిల్లలతో సహా కనీసం 378 మంది నిరసనకారులు అణచివేత శక్తులచే చంపబడ్డారని ఇరాన్ మానవ హక్కుల డైరెక్టర్ మహమూద్ అమిరీ-మొగద్దమ్ చెప్పారు.
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
Shraddha Walker Case: శ్రద్ధ కేసులో మరో ట్విస్ట్.. సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు
పాకిస్తాన్తో ఇరాన్ ఆగ్నేయ సరిహద్దులో ఉన్న సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్లో కనీసం 123 మంది, కుర్దిస్తాన్, టెహ్రాన్ ప్రావిన్సులలో 40 మంది, పశ్చిమ అజర్బైజాన్ ప్రావిన్స్లో 39 మంది మరణించారు. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశానికి ముందు ప్రభుత్వం అబద్ధాలను వ్యాప్తి చేసే ప్రచారం పెంచుతోందని ఇరాన్ మానవ హక్కుల సంఘం తెలిపింది. ఆందోళనకారుల హత్యను దాష్ వంటి తీవ్రవాద గ్రూపులకు ఆపాదించడం ద్వారా వారికి రెండు లక్ష్యాలు ఉన్నాయని అని ఇస్లామిక్ స్టేట్ గ్రూపును ప్రస్తావిస్తూ అమీరీ-మొగద్దమ్ అన్నారు. మందుగుండు సామగ్రిని మరింత విస్తృతంగా ఉపయోగించడం కోసం వారు దీనిని ఒక సాకుగా ఉపయోగించాలనుకుంటున్నారని ఆయన చెప్పారు. చెప్పాడు. నవంబర్ 24న సమావేశమయ్యే యూఎన్ మానవ హక్కుల మండలిలోని దేశాలను కూడా ప్రభావితం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇరాన్లో అణచివేతపై స్వతంత్ర దర్యాప్తు, జవాబుదారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అవకాశాల నేపథ్యంలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
-
Mega 158 : నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే?
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!