Iran Protests: ఇరాన్ నిరసనల అణిచివేతలో 47 మంది పిల్లలతో సహా 378 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Protests: ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలపై ఉక్కుపాదం మోపింది. దాడులు, అరెస్టులు, హత్యలతో ఇరాన్ దేశం మొత్తాన్ని ఓ యుద్ద క్షేత్రంలా మార్చింది. సెప్టెంబరులో మహ్సా అమిని అనే యువతి హిజాబ్ సరిగా వేసుకోలేదనే కారణంతో పోలీసులు కొట్టి చంపిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ముఖ్యంగా స్త్రీలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. వారికి మద్దతుగా పురుషులు కూడా రోడ్లెక్కుతున్నారు. పాఠశాల విద్యార్థులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహంతో తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హింసకు తెరలేపింది. నిరసనకారులపై దాడులు, అరెస్టులు, హత్యలతో ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తోంది. అయినా ఉద్యమం ఆగకపోగా దేశవ్యాప్తంగా విస్తరించింది.
మహ్సా అమినీ మరణంతో చెలరేగిన నిరసనలపై అణిచివేతలో ఇరాన్ భద్రతా దళాలు కనీసం 47 మంది పిల్లలతో సహా 378 మందిని హతమార్చాయని ఇరాన్ మానవ హక్కుల సంఘం శనివారం వెల్లడించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంలో మహిళల కోసం కఠినమైన దుస్తుల నియమావళిని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసిన మూడు రోజుల తర్వాత, సెప్టెంబర్ 16న అమిని మరణంపై చెలరేగిన నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనలు మహిళల దుస్తుల నిబంధనలపై ఆగ్రహంతో ఊపందుకున్నాయి, కానీ 1979 విప్లవం నుండి ఇరాన్ను పాలించిన దైవపరిపాలనకు వ్యతిరేకంగా విస్తృత ఉద్యమంగా ఎదిగింది. సెప్టెంబర్ 16 నుంచి 47 మంది పిల్లలతో సహా కనీసం 378 మంది నిరసనకారులు అణచివేత శక్తులచే చంపబడ్డారని ఇరాన్ మానవ హక్కుల డైరెక్టర్ మహమూద్ అమిరీ-మొగద్దమ్ చెప్పారు.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
Shraddha Walker Case: శ్రద్ధ కేసులో మరో ట్విస్ట్.. సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు
పాకిస్తాన్తో ఇరాన్ ఆగ్నేయ సరిహద్దులో ఉన్న సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్లో కనీసం 123 మంది, కుర్దిస్తాన్, టెహ్రాన్ ప్రావిన్సులలో 40 మంది, పశ్చిమ అజర్బైజాన్ ప్రావిన్స్లో 39 మంది మరణించారు. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశానికి ముందు ప్రభుత్వం అబద్ధాలను వ్యాప్తి చేసే ప్రచారం పెంచుతోందని ఇరాన్ మానవ హక్కుల సంఘం తెలిపింది. ఆందోళనకారుల హత్యను దాష్ వంటి తీవ్రవాద గ్రూపులకు ఆపాదించడం ద్వారా వారికి రెండు లక్ష్యాలు ఉన్నాయని అని ఇస్లామిక్ స్టేట్ గ్రూపును ప్రస్తావిస్తూ అమీరీ-మొగద్దమ్ అన్నారు. మందుగుండు సామగ్రిని మరింత విస్తృతంగా ఉపయోగించడం కోసం వారు దీనిని ఒక సాకుగా ఉపయోగించాలనుకుంటున్నారని ఆయన చెప్పారు. చెప్పాడు. నవంబర్ 24న సమావేశమయ్యే యూఎన్ మానవ హక్కుల మండలిలోని దేశాలను కూడా ప్రభావితం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇరాన్లో అణచివేతపై స్వతంత్ర దర్యాప్తు, జవాబుదారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అవకాశాల నేపథ్యంలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆన్నారు.
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!