Iran Protests: ఇరాన్ నిరసనల అణిచివేతలో 47 మంది పిల్లలతో సహా 378 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Protests: ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలపై ఉక్కుపాదం మోపింది. దాడులు, అరెస్టులు, హత్యలతో ఇరాన్ దేశం మొత్తాన్ని ఓ యుద్ద క్షేత్రంలా మార్చింది. సెప్టెంబరులో మహ్సా అమిని అనే యువతి హిజాబ్ సరిగా వేసుకోలేదనే కారణంతో పోలీసులు కొట్టి చంపిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ముఖ్యంగా స్త్రీలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. వారికి మద్దతుగా పురుషులు కూడా రోడ్లెక్కుతున్నారు. పాఠశాల విద్యార్థులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహంతో తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హింసకు తెరలేపింది. నిరసనకారులపై దాడులు, అరెస్టులు, హత్యలతో ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తోంది. అయినా ఉద్యమం ఆగకపోగా దేశవ్యాప్తంగా విస్తరించింది.
మహ్సా అమినీ మరణంతో చెలరేగిన నిరసనలపై అణిచివేతలో ఇరాన్ భద్రతా దళాలు కనీసం 47 మంది పిల్లలతో సహా 378 మందిని హతమార్చాయని ఇరాన్ మానవ హక్కుల సంఘం శనివారం వెల్లడించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంలో మహిళల కోసం కఠినమైన దుస్తుల నియమావళిని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసిన మూడు రోజుల తర్వాత, సెప్టెంబర్ 16న అమిని మరణంపై చెలరేగిన నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనలు మహిళల దుస్తుల నిబంధనలపై ఆగ్రహంతో ఊపందుకున్నాయి, కానీ 1979 విప్లవం నుండి ఇరాన్ను పాలించిన దైవపరిపాలనకు వ్యతిరేకంగా విస్తృత ఉద్యమంగా ఎదిగింది. సెప్టెంబర్ 16 నుంచి 47 మంది పిల్లలతో సహా కనీసం 378 మంది నిరసనకారులు అణచివేత శక్తులచే చంపబడ్డారని ఇరాన్ మానవ హక్కుల డైరెక్టర్ మహమూద్ అమిరీ-మొగద్దమ్ చెప్పారు.
Also Read
Shraddha Walker Case: శ్రద్ధ కేసులో మరో ట్విస్ట్.. సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు
పాకిస్తాన్తో ఇరాన్ ఆగ్నేయ సరిహద్దులో ఉన్న సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్లో కనీసం 123 మంది, కుర్దిస్తాన్, టెహ్రాన్ ప్రావిన్సులలో 40 మంది, పశ్చిమ అజర్బైజాన్ ప్రావిన్స్లో 39 మంది మరణించారు. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశానికి ముందు ప్రభుత్వం అబద్ధాలను వ్యాప్తి చేసే ప్రచారం పెంచుతోందని ఇరాన్ మానవ హక్కుల సంఘం తెలిపింది. ఆందోళనకారుల హత్యను దాష్ వంటి తీవ్రవాద గ్రూపులకు ఆపాదించడం ద్వారా వారికి రెండు లక్ష్యాలు ఉన్నాయని అని ఇస్లామిక్ స్టేట్ గ్రూపును ప్రస్తావిస్తూ అమీరీ-మొగద్దమ్ అన్నారు. మందుగుండు సామగ్రిని మరింత విస్తృతంగా ఉపయోగించడం కోసం వారు దీనిని ఒక సాకుగా ఉపయోగించాలనుకుంటున్నారని ఆయన చెప్పారు. చెప్పాడు. నవంబర్ 24న సమావేశమయ్యే యూఎన్ మానవ హక్కుల మండలిలోని దేశాలను కూడా ప్రభావితం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇరాన్లో అణచివేతపై స్వతంత్ర దర్యాప్తు, జవాబుదారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అవకాశాల నేపథ్యంలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆన్నారు.
తాజావార్తలు
-
Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
-
India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!