America: అమెరికాలో బీభత్సం సృష్టించిన టోర్నడో.. 21మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: అమెరికాలోని అర్కాన్సాస్, ఇల్లినాయిస్లో టోర్నడో సృష్టించిన విధ్వంసం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ తుపాను కారణంగా పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం, శుక్ర, శనివారాల్లో 60కి పైగా టోర్నడోలు నమోదయ్యాయి. లిటిల్ రాక్లో కనీసం ఒకరు మరణించారు. 24 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తుఫాను ఆర్కాన్సాస్లోని వేన్లో కూడా టోర్నడో విధ్వంసం సృష్టించింది. చాలా ఇళ్లు కూలిపోయి.. శిథిలాల కింద ప్రజలు సమాధి అయ్యారు.
Read Also: Encounter: జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్…ఐదుగురు మావోయిస్టుల హతం
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
ఇల్లినాయిస్లోని బెల్విడెరేలో శుక్రవారం రాత్రి తుఫాను కారణంగా థియేటర్ పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. ఇల్లినాయిస్లో వడగళ్లు సంభవించాయి. ఓక్లహోమాలో గడ్డి మంటలు మరింత తీవ్రమయ్యాయి. దాదాపు 350,000 మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నారని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రభుత్వం నుండి సాధ్యమైనంత సహాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హామీ ఇచ్చారు. లిటిల్ రాక్లో, సుడిగాలి మొదట నగరం పశ్చిమ వైపు.. దాని పరిసరాలను తాకింది. ఇది ఒక చిన్న షాపింగ్ సెంటర్ను దెబ్బతీసింది. అనంతరం సుడిగాలి అర్కాన్సాస్ నదిని దాటి నార్త్ లిటిల్ రాక్ చుట్టుపక్కల నగరాల్లోకి ప్రవేశించింది. అక్కడ అది గృహాలు, వ్యాపారాలు, వాహనాలకు విస్తృత నష్టాన్ని కలిగించింది. బాప్టిస్ట్ హెల్త్ మెడికల్ సెంటర్ అధికారులు మాట్లాడుతూ తుఫానులో గాయపడిన 21 మందిని ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మేయర్ ఫ్రాంక్ స్కాట్ జూనియర్ 24 మంది ఆసుపత్రిలో చేరినట్లు అధికారులకు సమాచారం ఉందని, అయితే ఈ సమయంలో ఎటువంటి మరణాలు సంభవించలేదని ట్వీట్ చేశారు.
Read Also : Girl fight with boys : అబ్బాయిలకు బుద్ధి చెప్పిన లేడీ బ్రూస్లీ
వైన్లోని సిటీ కౌన్సిల్ సభ్యురాలు లిసా పావెల్ కార్టర్ మాట్లాడుతూ నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయని అన్నారు. తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. ఈ నివాసి మాట్లాడుతూ ‘1985 నుండి ఇక్కడ నివసిస్తున్నాను. కౌంటీ మొత్తం నాకు బాగా తెలుసు. తుఫాను కారణంగా ల్యాండ్మార్క్లను గుర్తించలేక నేను షాక్ అయ్యాను’ అని అన్నారు.
తాజావార్తలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!