America: అమెరికాలో బీభత్సం సృష్టించిన టోర్నడో.. 21మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: అమెరికాలోని అర్కాన్సాస్, ఇల్లినాయిస్లో టోర్నడో సృష్టించిన విధ్వంసం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ తుపాను కారణంగా పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం, శుక్ర, శనివారాల్లో 60కి పైగా టోర్నడోలు నమోదయ్యాయి. లిటిల్ రాక్లో కనీసం ఒకరు మరణించారు. 24 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తుఫాను ఆర్కాన్సాస్లోని వేన్లో కూడా టోర్నడో విధ్వంసం సృష్టించింది. చాలా ఇళ్లు కూలిపోయి.. శిథిలాల కింద ప్రజలు సమాధి అయ్యారు.
Read Also: Encounter: జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్…ఐదుగురు మావోయిస్టుల హతం
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఇల్లినాయిస్లోని బెల్విడెరేలో శుక్రవారం రాత్రి తుఫాను కారణంగా థియేటర్ పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. ఇల్లినాయిస్లో వడగళ్లు సంభవించాయి. ఓక్లహోమాలో గడ్డి మంటలు మరింత తీవ్రమయ్యాయి. దాదాపు 350,000 మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నారని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రభుత్వం నుండి సాధ్యమైనంత సహాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హామీ ఇచ్చారు. లిటిల్ రాక్లో, సుడిగాలి మొదట నగరం పశ్చిమ వైపు.. దాని పరిసరాలను తాకింది. ఇది ఒక చిన్న షాపింగ్ సెంటర్ను దెబ్బతీసింది. అనంతరం సుడిగాలి అర్కాన్సాస్ నదిని దాటి నార్త్ లిటిల్ రాక్ చుట్టుపక్కల నగరాల్లోకి ప్రవేశించింది. అక్కడ అది గృహాలు, వ్యాపారాలు, వాహనాలకు విస్తృత నష్టాన్ని కలిగించింది. బాప్టిస్ట్ హెల్త్ మెడికల్ సెంటర్ అధికారులు మాట్లాడుతూ తుఫానులో గాయపడిన 21 మందిని ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మేయర్ ఫ్రాంక్ స్కాట్ జూనియర్ 24 మంది ఆసుపత్రిలో చేరినట్లు అధికారులకు సమాచారం ఉందని, అయితే ఈ సమయంలో ఎటువంటి మరణాలు సంభవించలేదని ట్వీట్ చేశారు.
Read Also : Girl fight with boys : అబ్బాయిలకు బుద్ధి చెప్పిన లేడీ బ్రూస్లీ
వైన్లోని సిటీ కౌన్సిల్ సభ్యురాలు లిసా పావెల్ కార్టర్ మాట్లాడుతూ నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయని అన్నారు. తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. ఈ నివాసి మాట్లాడుతూ ‘1985 నుండి ఇక్కడ నివసిస్తున్నాను. కౌంటీ మొత్తం నాకు బాగా తెలుసు. తుఫాను కారణంగా ల్యాండ్మార్క్లను గుర్తించలేక నేను షాక్ అయ్యాను’ అని అన్నారు.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!