China Manja : పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టివేత
- పాతబస్తీలో భారీగా చైనా మంజా పట్టివేత
- దాదాపు రూ.2కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం
- పాతబస్తీలో పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు
- టాస్క్ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD: పాతబస్తీలో భారీగా నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాతబస్తీలోని పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు నిర్వహించి.. టాస్క్ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేశారు. చైనా మాంజా విక్రయదారులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే.. సంక్రాంతి వేళ నిషేధిత చైనీస్ సింథటిక్ మాంజా విస్తృతంగా వినియోగం అవుతోంది. ఈ మాంజా రోడ్లపై, చెట్లపై తెగిపడి వాహనదారులకు ప్రమాదకరంగా మారగా, పక్షుల ప్రాణాలను సైతం హరిస్తోంది. గాజు ముక్కల పొడి, వివిధ రసాయనాల మిశ్రమంతో తయారైన ఈ మాంజా పతంగులు ఎగురవేసే పిల్లలకు తీవ్ర గాయాలు కలిగిస్తోంది.
Viral Video : తలైవా పాటకు.. చెస్ ఛాంపియన్స్ స్టెప్పులు..
Also Read
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
- Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
పోలీసులు నిషేధిత మాంజా అమ్మకాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నా, ఇది గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లోకి వచ్చేస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ నిషేధిత మాంజా విక్రయాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. గుల్జార్హౌజ్, కేశవగిరి, సంతోష్నగర్, ధూల్పేట్, నాంపల్లి, పురానాపూల్ ప్రాంతాల్లోని 500కుపైగా పతంగుల దుకాణాలు హోల్సేల్ వ్యాపారం చేస్తుంటాయి. పాతబస్తీకి తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి రిటైల్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో వస్తారు. దుకాణాలతో పాటు గోదాముల్లో నిల్వ చేసిన మాంజా ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. సంక్రాంతి సమయంలో ఈ ప్రాంతంలో రూ.50 కోట్లు దాటే వ్యాపారం జరుగుతుంది.
నిషేధిత మాంజా వల్ల పక్షులు తీవ్రమైన గాయాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ది యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సొసైటీ (AWCS) పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గత ఏడాది సంక్రాంతి పండగ సమయంలో 3 రోజుల్లో 45 పక్షులను, ఏడాదిలో మొత్తం 1256 పక్షులను రక్షించిన AWCS ఈ సంవత్సరం జనవరి 10 నాటికి 22 పక్షులను రక్షించింది. పర్యావరణానికి హానికరమైన నిషేధిత మాంజాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని, పక్షుల రక్షణకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
Team India: 8 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్ ప్లేయర్..!
తాజావార్తలు
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
-
Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
-
VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?