China Manja : పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టివేత
- పాతబస్తీలో భారీగా చైనా మంజా పట్టివేత
- దాదాపు రూ.2కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం
- పాతబస్తీలో పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు
- టాస్క్ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD: పాతబస్తీలో భారీగా నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాతబస్తీలోని పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు నిర్వహించి.. టాస్క్ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేశారు. చైనా మాంజా విక్రయదారులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే.. సంక్రాంతి వేళ నిషేధిత చైనీస్ సింథటిక్ మాంజా విస్తృతంగా వినియోగం అవుతోంది. ఈ మాంజా రోడ్లపై, చెట్లపై తెగిపడి వాహనదారులకు ప్రమాదకరంగా మారగా, పక్షుల ప్రాణాలను సైతం హరిస్తోంది. గాజు ముక్కల పొడి, వివిధ రసాయనాల మిశ్రమంతో తయారైన ఈ మాంజా పతంగులు ఎగురవేసే పిల్లలకు తీవ్ర గాయాలు కలిగిస్తోంది.
Viral Video : తలైవా పాటకు.. చెస్ ఛాంపియన్స్ స్టెప్పులు..
Also Read
- Saikrishna Custodial Death Case: సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచనల విషయాలు!
- 6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
- Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్లోనే కాదు.. పాకిస్థాన్లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
పోలీసులు నిషేధిత మాంజా అమ్మకాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నా, ఇది గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లోకి వచ్చేస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ నిషేధిత మాంజా విక్రయాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. గుల్జార్హౌజ్, కేశవగిరి, సంతోష్నగర్, ధూల్పేట్, నాంపల్లి, పురానాపూల్ ప్రాంతాల్లోని 500కుపైగా పతంగుల దుకాణాలు హోల్సేల్ వ్యాపారం చేస్తుంటాయి. పాతబస్తీకి తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి రిటైల్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో వస్తారు. దుకాణాలతో పాటు గోదాముల్లో నిల్వ చేసిన మాంజా ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. సంక్రాంతి సమయంలో ఈ ప్రాంతంలో రూ.50 కోట్లు దాటే వ్యాపారం జరుగుతుంది.
నిషేధిత మాంజా వల్ల పక్షులు తీవ్రమైన గాయాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ది యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సొసైటీ (AWCS) పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గత ఏడాది సంక్రాంతి పండగ సమయంలో 3 రోజుల్లో 45 పక్షులను, ఏడాదిలో మొత్తం 1256 పక్షులను రక్షించిన AWCS ఈ సంవత్సరం జనవరి 10 నాటికి 22 పక్షులను రక్షించింది. పర్యావరణానికి హానికరమైన నిషేధిత మాంజాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని, పక్షుల రక్షణకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
Team India: 8 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్ ప్లేయర్..!
తాజావార్తలు
-
Saikrishna Custodial Death Case: సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచనల విషయాలు!
-
Tamannaah Bhatia: బాలీవుడ్, టాలీవుడ్ మధ్య తేడాలపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood: విమర్శలు వస్తే బ్రేక్ తీసుకోవాల్సిందేనా!
-
Chiranjeevi : అవార్డులపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్
-
UPI Auto-Pay: డబుల్ పేమెంట్లకు చెక్.. యూపీఐలో కొత్త ఫీచర్ తీసుకొస్తున్న ఎన్ పీసీఐ
ట్రెండింగ్
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!