China Manja : పాతబస్తీలో భారీగా చైనా మాంజా పట్టివేత
- పాతబస్తీలో భారీగా చైనా మంజా పట్టివేత
- దాదాపు రూ.2కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం
- పాతబస్తీలో పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు
- టాస్క్ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD: పాతబస్తీలో భారీగా నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాతబస్తీలోని పతంగుల విక్రయ షాపుల్లో సోదాలు నిర్వహించి.. టాస్క్ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేశారు. చైనా మాంజా విక్రయదారులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే.. సంక్రాంతి వేళ నిషేధిత చైనీస్ సింథటిక్ మాంజా విస్తృతంగా వినియోగం అవుతోంది. ఈ మాంజా రోడ్లపై, చెట్లపై తెగిపడి వాహనదారులకు ప్రమాదకరంగా మారగా, పక్షుల ప్రాణాలను సైతం హరిస్తోంది. గాజు ముక్కల పొడి, వివిధ రసాయనాల మిశ్రమంతో తయారైన ఈ మాంజా పతంగులు ఎగురవేసే పిల్లలకు తీవ్ర గాయాలు కలిగిస్తోంది.
Viral Video : తలైవా పాటకు.. చెస్ ఛాంపియన్స్ స్టెప్పులు..
Also Read
- Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
- Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
- Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
పోలీసులు నిషేధిత మాంజా అమ్మకాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నా, ఇది గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లోకి వచ్చేస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ నిషేధిత మాంజా విక్రయాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. గుల్జార్హౌజ్, కేశవగిరి, సంతోష్నగర్, ధూల్పేట్, నాంపల్లి, పురానాపూల్ ప్రాంతాల్లోని 500కుపైగా పతంగుల దుకాణాలు హోల్సేల్ వ్యాపారం చేస్తుంటాయి. పాతబస్తీకి తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి రిటైల్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో వస్తారు. దుకాణాలతో పాటు గోదాముల్లో నిల్వ చేసిన మాంజా ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. సంక్రాంతి సమయంలో ఈ ప్రాంతంలో రూ.50 కోట్లు దాటే వ్యాపారం జరుగుతుంది.
నిషేధిత మాంజా వల్ల పక్షులు తీవ్రమైన గాయాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ది యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సొసైటీ (AWCS) పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గత ఏడాది సంక్రాంతి పండగ సమయంలో 3 రోజుల్లో 45 పక్షులను, ఏడాదిలో మొత్తం 1256 పక్షులను రక్షించిన AWCS ఈ సంవత్సరం జనవరి 10 నాటికి 22 పక్షులను రక్షించింది. పర్యావరణానికి హానికరమైన నిషేధిత మాంజాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని, పక్షుల రక్షణకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
Team India: 8 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా స్టార్ ప్లేయర్..!
తాజావార్తలు
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!