Warangal: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. కానీ కాసులకు కక్కుర్తిపడి పలు ప్రైవేట్ ఆస్పత్రులు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. అంతే కాకుండా అవసరం లేకున్న ఆపరేషన్లు చేస్తూ మహిళల ప్రాణాలపైకి తెస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరంగల్లో ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రులపై పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయా ఆసుపత్రులపై పోలీసులు నిఘా పెట్టారు. నలింగ నిర్ధారణ ద్వారా అబార్షన్లు చేస్తున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వారి నుంచి 18 సెల్ ఫోన్లు, రూ. 73 వేలు స్వాధీనం చేసుకున్నారు. లింగనిర్ధారణ ద్వారా అబార్షన్లు చేస్తున్న లోటస్ ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులను అరెస్టు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
Read Also: Sai Pallavi: సాయి పల్లవి నా క్రష్.. బాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్
నర్సంపేట కేంద్రంగా పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. విస్తు పోయే విషయం ఏంటంటే.. ఆయుర్వేద వైద్యులు కూడా అబార్షన్లు చేస్తున్నారు. ఈ చర్యలకు పాల్పడిన వైద్యులు, సిబ్బంది అందరినీ అరెస్టు చేస్తామని ఆయన హెచ్చరించారు. త్వరలో వైద్యశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులనుంచి అబార్షన్ల కోసం రూ. 30వేలు వసూలు చేస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు. వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డాక్టర్ బాల్నే పార్ధు, డాక్టర్ మోరం అరవింద, డాక్టర్ మోరం శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ బాల్నే పూర్ణిమ, వర్ని ప్రదీప్ రెడ్డి, కీతా రాజు, కాళ్ల అర్జున్, డీ ప్రణయ్ బాబు, కీర్తి మోహన్ తదితరులు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. బాల్నే ఆశాలత, కొంగర రేణుక, భూక్య అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్. మరికొంత మంది పరారీలో ఉన్నారు.
Read Also: Karnataka: మైసూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం..